Hero Venkatesh
‘ఎఫ్-3’ తర్వాత విక్టరీ వెంకటేష్ నటించే కొత్త సినిమా ఏదీ ఖరారవ్వలేదు. ఈలోపు ఆయన చేయబోయే అతిథి పాత్ర గురించి సమాచారం బయటికి వచ్చింది. విశ్వక్సేక్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఓరి దేవుడా’ సినిమాలో వెంకీ దేవుడి పాత్ర చేయబోతున్నట్లు వెల్లడైంది. తమిళంలో విజయ్ సేతుపతి ఈ పాత్రలో మెరిశాడు. కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లోనే అయినా.. ఆ పాత్ర అక్కడ మంచి ఇంపాక్ట్ వేసింది. సినిమాకు ఆకర్షణగా మారింది.
కన్నడలో ఇదే పాత్రను దివంగత పునీత్ రాజ్ కుమార్ చేయడం విశేషం. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. ఐతే ‘ఓరి దేవుడా’ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తోంది. కొవిడ్ టైంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయినట్లు, విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలొచ్చాయి. గత ఏడాదే కమింగ్ సూన్ అంటూ ప్రోమోలు రిలీజ్ చేశారు. విశ్వక్సేన్ మరో చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కంటే ముందు ఇది విడుదల కావాల్సింది. కానీ ఏం జరిగిందో ఏమో.. ఈ సినిమా ఉన్నట్లుండి వార్తల్లో లేకుండా పోయింది.
ముందు ఇందులోని దేవుడి పాత్రకు వేరే నటుడిని అనుకోగా.. షూటింగ్ మొదలు కావాల్సిన సమయంలో ఇంకాస్త పెద్ద హీరో చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఈ పాత్రను ఎవరితో చేయిద్దామా అని చూసి చూసి.. చివరికి వెంకీతో ఓకే చేయించుకున్నారు. ఆయన ఎట్టకేలకు ఖాళీ అయి ఈ సినిమాకు డేట్లు కేటాయించారు. కేవలం మూడే మూడు రోజుల కాల్ షీట్లు ఇచ్చారట వెంకీ. సినిమా మొత్తంలో ఆయన పాత్ర కనిపించేది పది నిమిషాలే. వెంకీ కాంబినేషన్ సీన్లు మినహా చిత్రీకరణ మొత్తం ఎప్పుడో పూర్తయింది.
విశ్వక్సేన్ మళ్లీ ‘ఓరి దేవుడా’ లుక్లోకి మారి వెంకీతో కలిసి సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. వెంకీ రావడంతో సినిమాకు ప్రమోషన్ల పరంగా మంచి బజ్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక విశ్వక్ ఎలాగూ అగ్రెసివ్ ప్రమోషన్లకు ఎప్పుడూ రెడీగానే ఉంటాడు. అందులోనూ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కూడా మంచి స్పందన తెచ్చుకుంది కాబట్టి ఈ చిత్రానికి మంచి హైప్ రావడం గ్యారెంటీ. తమిళంలో ‘ఓ మై కడవులే’ పేరుతో దీని ఒరిజినల్ను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వక్ సరసన బాలీవుడ్ భామ మిథిల పాల్కర్ నటించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ నిర్మించింది.
This post was last modified on August 10, 2022 12:32 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…