ప్యాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఎలాగో ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఒక మోడల్ ని ఆవిష్కరించాక అందరూ దాన్నే ఫాలో కాక తప్పని పరిస్థితి తలెత్తింది. మాతృబాష రాష్ట్రం కన్నా ఎక్కువగా ఇతర స్టేట్స్ కు వెళ్లి మరీ పబ్లిసిటీ చేస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని మరీ నగరాలూ పట్టణాలు రౌండ్ వేయాల్సి వస్తోంది. కాదేది ప్రచారానికి అనర్హం సామెతను పాటిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీమ్ మొత్తం వాలిపోతోంది.
ఇప్పుడు లైగర్, లాల్ సింగ్ చడ్డా బృందాలు అదే పనిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ గత పది రోజులకు పైగా నార్త్ టూర్ లోనే బిజీగా ఉన్నాడు. షాపింగ్ మాల్స్, కాలేజీలు, మెట్రో రైళ్లు, ప్రైవేట్ ఈవెంట్లు, హోటళ్లు, న్యూస్ ఛానల్స్ ఓటిటిలకు ఇంటర్వ్యూలు ఒకటేమిటి అన్నిరకాలుగా తనను తాను మార్కెట్ చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ముంబైలో అయితే ఏకంగా ఫ్యాన్స్ రద్దీని తట్టుకోలేక సగంలోనే మీటింగ్ ఆపేసి వెనుదిరగాల్సి రావడం అక్కడి మీడియాలో చాలా హై లైట్ అయ్యింది. ఇదంతా లైగర్ కథ.
మనోడు అక్కడ తిరుగుతుంటే అమీర్ ఖాన్ మాత్రం పదే పదే హైదరాబాద్ వస్తూ లాల్ సింగ్ మీద హైప్ పెంచే ప్రయత్నం జోరుగా చేస్తున్నాడు. చిరంజీవి నామమాత్రపు సమర్పకుడిగా వ్యవహరించకుండా ప్రత్యేకంగా దీని కోసం ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. ఏఎంబిలో వేసిన ప్రీమియర్ లో మూవీని రెండోసారి చూశారు. హిందీకన్నా ఎక్కువ అమీర్ ఫోకస్ ఇక్కడే ఉండటం విశేషం. అవతల రౌడీ హీరో ఉత్తరాదిలో, ఇవతల వర్సటైల్ స్టార్ దక్షిణాదిలో ఏదో ఎక్స్ చేంజ్ చేసుకున్నట్టు తెగ తిరిగేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో
This post was last modified on August 9, 2022 5:22 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…