ప్యాన్ ఇండియా సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఎలాగో ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఒక మోడల్ ని ఆవిష్కరించాక అందరూ దాన్నే ఫాలో కాక తప్పని పరిస్థితి తలెత్తింది. మాతృబాష రాష్ట్రం కన్నా ఎక్కువగా ఇతర స్టేట్స్ కు వెళ్లి మరీ పబ్లిసిటీ చేస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం ఇండస్ట్రీ జనాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని మరీ నగరాలూ పట్టణాలు రౌండ్ వేయాల్సి వస్తోంది. కాదేది ప్రచారానికి అనర్హం సామెతను పాటిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీమ్ మొత్తం వాలిపోతోంది.
ఇప్పుడు లైగర్, లాల్ సింగ్ చడ్డా బృందాలు అదే పనిలో ఉన్నాయి. విజయ్ దేవరకొండ గత పది రోజులకు పైగా నార్త్ టూర్ లోనే బిజీగా ఉన్నాడు. షాపింగ్ మాల్స్, కాలేజీలు, మెట్రో రైళ్లు, ప్రైవేట్ ఈవెంట్లు, హోటళ్లు, న్యూస్ ఛానల్స్ ఓటిటిలకు ఇంటర్వ్యూలు ఒకటేమిటి అన్నిరకాలుగా తనను తాను మార్కెట్ చేసుకోవడానికి బాగా కష్టపడుతున్నాడు. ముంబైలో అయితే ఏకంగా ఫ్యాన్స్ రద్దీని తట్టుకోలేక సగంలోనే మీటింగ్ ఆపేసి వెనుదిరగాల్సి రావడం అక్కడి మీడియాలో చాలా హై లైట్ అయ్యింది. ఇదంతా లైగర్ కథ.
మనోడు అక్కడ తిరుగుతుంటే అమీర్ ఖాన్ మాత్రం పదే పదే హైదరాబాద్ వస్తూ లాల్ సింగ్ మీద హైప్ పెంచే ప్రయత్నం జోరుగా చేస్తున్నాడు. చిరంజీవి నామమాత్రపు సమర్పకుడిగా వ్యవహరించకుండా ప్రత్యేకంగా దీని కోసం ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. ఏఎంబిలో వేసిన ప్రీమియర్ లో మూవీని రెండోసారి చూశారు. హిందీకన్నా ఎక్కువ అమీర్ ఫోకస్ ఇక్కడే ఉండటం విశేషం. అవతల రౌడీ హీరో ఉత్తరాదిలో, ఇవతల వర్సటైల్ స్టార్ దక్షిణాదిలో ఏదో ఎక్స్ చేంజ్ చేసుకున్నట్టు తెగ తిరిగేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…