Movie News

అన్న థియేటర్లో – తమ్ముడు ఓటిటిలో

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ ఇంకా హిట్టు కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. డెబ్యూ మూవీ దొరసాని నిరాశపరచగా రెండోది మిడిల్ క్లాస్ మెలోడీస్ లో మంచి కంటెంటే ఉన్నప్పటికీ కరోనా పరిస్థితుల్లో డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోయింది. డిజిటల్ లో వచ్చినప్పటికీ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.

మూడోది పుష్పక విమానంని ప్రచార ఆర్భాటాల మధ్య థియేటర్లలో వదిలారు కాని ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే ఓటిటిలో చూసిన జనాలే ఎక్కువని తేలింది. ఇప్పుడు నాలుగోది హైవే. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికే సరైన రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎట్టకేలకు ఓటిటి రూటే ఎంచుకుంది.

ఈ నెల 19న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనిష్చితిని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. జనాలు చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్ దాకా రావడం లేదు. ఏదో మరీ అద్భుతంగా ఉందని పబ్లిక్ చెబితేనో మీడియాలో వస్తేనో  తప్ప కాలు బయట పెట్టడం లేదు

అన్న విజయ్ లైగర్ ఆగస్ట్ 25న అత్యథిక స్క్రీన్లలో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అందుకోనుంది. దానికి వారం ముందు హైవేని ఇలా స్మార్ట్ స్క్రీన్లలో వదలబోతున్నారు. దీనికి దర్శకుడు కెవి గుహన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్. తెలుగులో కళ్యాణ్ రామ్ 118తో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టారు. దానికి మంచి పేరే వచ్చింది. ఆ మధ్య డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు అనే చిన్న సినిమా ఓటిటికి చేశారు. టెక్నికల్ గా పేరొచ్చింది. ఇప్పుడీ హైవేతో ఏం చేయబోతున్నారో చూడాలి. ఇవి కాకుండా ఆనంద్ లిస్టులో బేబీ, గంగంగణేష్ లు చివరి దశ నిర్మాణంలో ఉన్నాయి. 

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

2 hours ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

3 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

3 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

4 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

4 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

4 hours ago