ఏడాది వెనక్కి వెళ్తే నందమూరి అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజై అప్పటికి మూడేళ్లు అయింది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఎప్పుడో ఏంటో అప్పటికి క్లారిటీ లేదు. అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. నందమూరి బాలకృష్ణ అప్పటికి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఆయన చివరి సినిమా ‘రూలర్’ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక కళ్యాణ్ రామ్ సంగతి సరే సరి. ‘ఎంత మంచివాడవురా’తో అతను చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.
కానీ ఏడాది తిరిగేసరికి ఇప్పుడు మొత్తం కథ మారిపోయింది. ముగ్గురు నందమూరి హీరోలూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లతో అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. గత ఏడాది చివర్లో బాలయ్య సినిమా ‘అఖండ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. డివైడ్ టాక్ను తట్టుకుని ఆ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. మూణ్నాలుగు వారాల తర్వాత కూడా ఆ చిత్రం హౌస్ఫుల్స్తో రన్ అయింది.
కొన్ని నెలల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. అందులో అతడి నట ప్రతిభకు వివిధ భాషల ప్రేక్షకులు జేజేలు పలికారు. సినిమా కూడా భారీ విజయం సాధించి తారక్ మార్కెట్ను పెంచింది. ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాతి సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. చివరగా అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. ‘బింబిసార’కు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అంచనాలను మించిపోతున్నాయి.
తొలి రోజు సాయంత్రం నుంచి ఈ సినిమాకు థియేటర్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. బయ్యర్ల పెట్టుబడిలో సగం తొలి రోజే వచ్చేసిందంటే ఈ సినిమా ఎంత బాగా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ బయ్యర్లందరూ వీకెండ్లోనే లాభాల బాట పట్టబోతున్నారు. సినిమా పెద్ద రేంజికి వెళ్లబోతోందన్నది స్పష్టం. ఇలా 9 నెలల వ్యవధిలో ముగ్గురు నందమూరి హీరోలు భారీ విజయాలతో అదరగొట్టడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది.
This post was last modified on August 7, 2022 12:00 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…