నిఖిల్ టీమ్ కనక రాజీ వద్దనుకుని ఉంటే నిన్న బింబిసార, సీతారామంలతో పాటు కార్తికేయ 2 కూడా విడుదలయ్యేది. కానీ ఒత్తిళ్లో లేక క్లాష్ పెట్టుకుని ఓపెనింగ్స్ తగ్గించుకోవడం ఎందుకనే భావనో మొత్తానికి ముందు ఆగస్ట్ 12 అని చెప్పి ఫైనల్ గా 13కి లాక్ చేశారు. జరిగేది అంతా మంచికే అనే పెద్దల మాట ఇప్పుడీ సినిమా విషయంలో అక్షరాలా నిజమయ్యింది.
ఎందుకంటే బింబిసారకు పాజిటివ్ టాక్ తో పాటు మాస్ నుంచి బలమైన సపోర్ట్ దక్కింది. ముఖ్యంగా బిసి సెంటర్ల వసూళ్లు దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరోవైపు సీతారామం దానికి ధీటుగా తన జానర్ కు సాధారణంగా వచ్చే స్లో రెస్పాన్స్ కి భిన్నంగా రెండో రోజు నుంచే స్పీడ్ పెంచేసింది. నగరాలు పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి.
మీడియా రివ్యూలు, ఫేస్ బుక్ ఇన్స్ టా ఫీడ్ బ్యాక్స్ అన్నీ పాజిటివ్ గా ఉండటంతో కమర్షియల్ గానూ డీసెంట్ రేంజ్ కి చేరుకునే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఒకవేళ కార్తికేయ 2 కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ వీటి మధ్యలో కనక వచ్చి ఉంటే ఆడియన్స్ కి లేనిపోని కన్ఫ్యూజన్ వచ్చి దాని ప్రభావం నేరుగా కలెక్షన్ల మీద పడేది.
ఇదంతా బాగానే ఉంది కానీ కార్తికేయ 2 మీద ఇప్పుడు మరో బరువొచ్చి పడింది. పైన చెప్పిన రెండూ హిట్ కావడంతో రెండో వారంలోనూ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తాయి. పైగా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంలతో ఢీ కొంటూ నిఖిల్ యుద్ధం చేయాల్సి ఉంటుంది. నీరసంగా ఉన్న బాక్సాఫీస్ వద్ద కొత్త జోష్ వచ్చిన నేపథ్యంలో దాన్ని గనక కార్తికేయ 2 సరిగా వాడుకుంటే ఇంత గ్యాప్ తీసుకున్న నిఖిల్ కు న్యాయం జరిగినట్టు అవుతుంది. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ఫాంటసీ డ్రామా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.
This post was last modified on August 6, 2022 6:53 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…