ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న కార్తికేయ 2 కోసం నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో, ప్రమోషన్ల కోసం సోలోగా ఎంతగా తిరుగుతున్నాడో దానికి తగ్గ ఫలితం రావాలని అభిమానులతో పాటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు. అయితే డేట్ విషయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మానసిక క్షోభకు గురైన నిఖిల్ కు ఇంకా ఆ చిక్కుముడులు తొలగినట్టు లేదు.
మళ్ళీ మరోసారి వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా ఉంది. ఒక రోజు ఆలస్యంగా 13న లేదంటే ఇంకో వారం పోస్ట్ పోన్ చేసి 19కి వచ్చేలా యూనిట్ చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటనేం రాలేదు కానీ మారడం కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంతో స్క్రీన్లను పంచుకునే విషయంలో కార్తికేయ 2కి ఇంకా సంక్లిష్ఠత తొలగిపోలేదు.
దానికి తోడు వారం ముందు వచ్చే బింబిసార, సీతారామంలు కనీసం రెండు వారాల అగ్రిమెంట్లతో థియేటర్లను లాక్ చేసుకోవడంతో నిఖిల్ సినిమా కౌంట్ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ 13 అయితే ఆలోగా అమీర్ ఖాన్, నితిన్ చిత్రాల టాక్ బయటికి వచ్చేసుంటుంది కాబట్టి శనివారం నిశ్చింతగా బరిలో దిగొచ్చు.
మొత్తానికి మూవీలో ఉన్న సస్పెన్స్ కార్తికేయ 2కి రియల్ లైఫ్ లోనూ తప్పడం లేదు. అసలే అర్జున్ సురవరం తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఇది. దీని ఫలితం, బిజినెస్ మీద నెక్స్ట్ రాబోయే 18 పేజెస్, స్పై సినిమాల లెక్కలు ఆధారపడి ఉన్నాయి. ఇన్ని ఆశలు పెట్టుకున్న టైంలో ఇలా జరగడం ఆశనిపాతమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు చందూ మొండేటి దర్శకుడు. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీశారు.
This post was last modified on August 3, 2022 12:20 pm
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…