ఈ నెల 12న రిలీజ్ కాబోతున్న కార్తికేయ 2 కోసం నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో, ప్రమోషన్ల కోసం సోలోగా ఎంతగా తిరుగుతున్నాడో దానికి తగ్గ ఫలితం రావాలని అభిమానులతో పాటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు. అయితే డేట్ విషయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా మానసిక క్షోభకు గురైన నిఖిల్ కు ఇంకా ఆ చిక్కుముడులు తొలగినట్టు లేదు.
మళ్ళీ మరోసారి వాయిదా తప్పదనే ప్రచారం ఫిలిం నగర్ లో జోరుగా ఉంది. ఒక రోజు ఆలస్యంగా 13న లేదంటే ఇంకో వారం పోస్ట్ పోన్ చేసి 19కి వచ్చేలా యూనిట్ చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. ఇంకా అధికారిక ప్రకటనేం రాలేదు కానీ మారడం కన్ఫర్మ్ అని ఇన్ సైడ్ టాక్. లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంతో స్క్రీన్లను పంచుకునే విషయంలో కార్తికేయ 2కి ఇంకా సంక్లిష్ఠత తొలగిపోలేదు.
దానికి తోడు వారం ముందు వచ్చే బింబిసార, సీతారామంలు కనీసం రెండు వారాల అగ్రిమెంట్లతో థియేటర్లను లాక్ చేసుకోవడంతో నిఖిల్ సినిమా కౌంట్ విషయంలో రాజీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ 13 అయితే ఆలోగా అమీర్ ఖాన్, నితిన్ చిత్రాల టాక్ బయటికి వచ్చేసుంటుంది కాబట్టి శనివారం నిశ్చింతగా బరిలో దిగొచ్చు.
మొత్తానికి మూవీలో ఉన్న సస్పెన్స్ కార్తికేయ 2కి రియల్ లైఫ్ లోనూ తప్పడం లేదు. అసలే అర్జున్ సురవరం తర్వాత గ్యాప్ తీసుకుని చేస్తున్న ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఇది. దీని ఫలితం, బిజినెస్ మీద నెక్స్ట్ రాబోయే 18 పేజెస్, స్పై సినిమాల లెక్కలు ఆధారపడి ఉన్నాయి. ఇన్ని ఆశలు పెట్టుకున్న టైంలో ఇలా జరగడం ఆశనిపాతమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు చందూ మొండేటి దర్శకుడు. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో విజువల్ ఎఫెక్ట్స్ మీద చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీశారు.
This post was last modified on August 3, 2022 12:20 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…