కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ రిలీజ్ రెడీ అయింది. వచ్చే శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే అధిక బడ్జెట్ తో భారీ స్కేల్ లో తీసిన ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయబోతున్నారు. అసలు కంటెంట్ లేని ఏ మాత్రం క్రేజ్ లేని చిన్న చిన్న సినిమాలే హిందీ , తమిళ్ , కన్నడ లో రిలీజ్ చేసుకుంటూ దానికి పాన్ ఇండియా మూవీ అనే పేరు పెట్టేసుకుంటున్న ఈ రోజుల్లో బింబిసార ను కళ్యాణ్ రామ్ ఓన్లీ పాన్ తెలుగు అంటూ రిలీజ్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అసలు కళ్యాణ్ రామ్ కి పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు ఇష్టం లేదు? కంటెంట్ మీద నమ్మకం లేకా? ఇమేజ్ లేనందువల్ల భయపడుతున్నారా ? ఇలా అందరిలోనూ చాలా సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇటివలే దీని గురించి స్పందించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశాడు కళ్యాణ్ రామ్. బింబిసార ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే వెంటనే మిగతా భాషల్లో రిలీజ్ ఉంటుందని అన్నారు. ఇక్కడ రిజల్ట్ ని బట్టే అక్కడ రిలీజ్ ఆలోచిస్తానని అన్నాడు.
సినిమా హిట్టయితే రెండు వారాల్లోనే అంటే ఆగస్ట్ 18నే మిగతా భాషల్లో రిలీజ్ ఉండనుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే కేవలం రెండు వారాల్లో ఇదంతా సాధ్యమా ? కళ్యాణ్ రామ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాడా ? అనే సందేహాలు ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి.
ఎందుకంటే రెండు వారాల్లో రిలీజ్ అంటే ఇటు డబ్బింగ్ స్టార్ట్ చేసుకోవాలి అటు ప్రమోషన్స్ చేసుకోవాలి ఈ రెండూ అంత త్వరగా అయ్యే పనులు కావు. ఇటివలే దర్శకుడు వషిష్ఠ కూడా అదే చెప్పుకున్నాడు. తమ దగ్గర అస్సలు టైం లేదని పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ తిరగాలని అన్నాడు. మరి కళ్యాణ్ రామ్ ఇవన్నీ ఆలోచించకుండా అంత కచ్చితంగా డేట్ చెప్తాడా ? అంటే నందమూరి హీరో ఏదో ప్లాన్ చేసుకొని రెడీ గా ఉన్నాడన్నమాట. మరి చూడాలి తెలుగు రాష్ట్రలో బింబిసార రిజల్ట్ ఎలా ఉంటుందో ?
This post was last modified on August 2, 2022 10:38 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…