గత ఏడాది కాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి చర్చ జరిగింది అక్కినేని నాగచైతన్య-సమంత జంట గురించే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇద్దరూ అధికారికంగా తమ విడాకుల గురించి ప్రకటించి పది నెలలు కావస్తున్నా.. ఇంకా తరచుగా ఈ అంశం చర్చనీయాంశంగానే ఉంటోంది.
ఈ వ్యవహారంపై మీడియాను కలిసినపుడల్లా సాధ్యమైనంత వరకు చైతూ మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ మీడియా అతడితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చైతూ-సామ్ విడాకుల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ఆసక్తి బయటి వారికి ఎందుకని అతను సూటిగా ప్రశ్నించాడు.
ఒక నటుడిగా అందరూ తన వర్క్ గురించి మాట్లాడుకోవాలని కోరుకకుంటానని.. కానీ వ్యక్తిగత విషయాల గురించి కాదని, కానీ ఈ రంగంలో ఉన్న వారి విషయంలో ఆ విషయాలే అందరికీ ఆసక్తి కలిగించడం దురదృష్టకరమని చైతూ అన్నాడు. తాను, సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించామని.. మంచైనా, చెడైనా జనాలకు ఏదైనా విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నపుడు చెబుతామని.. తాను, సామ్ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని అనుకున్నామని.. ఐతే తాము చెప్పిన విషయానికి మించి తమ జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ చెప్పాలని తాను భావించడం లేదని చైతూ స్పష్టం చేశాడు.
తన జీవితంలో ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసని చైతూ అన్నాడు. తన గురించి ఊహాగానాలు, ప్రచారాలు తాత్కాలికమే అని.. న్యూస్ను న్యూసే రీప్లేస్ చేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. దీనిపై తానెంత స్పందిస్తే అంతగా వార్తలు పుట్టుకొస్తాయని, అందుకే సైలెంటుగా ఉన్నానని, ఏదో ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయని చైతూ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on August 2, 2022 9:05 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…