గత ఏడాది కాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి చర్చ జరిగింది అక్కినేని నాగచైతన్య-సమంత జంట గురించే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇద్దరూ అధికారికంగా తమ విడాకుల గురించి ప్రకటించి పది నెలలు కావస్తున్నా.. ఇంకా తరచుగా ఈ అంశం చర్చనీయాంశంగానే ఉంటోంది.
ఈ వ్యవహారంపై మీడియాను కలిసినపుడల్లా సాధ్యమైనంత వరకు చైతూ మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ మీడియా అతడితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చైతూ-సామ్ విడాకుల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ఆసక్తి బయటి వారికి ఎందుకని అతను సూటిగా ప్రశ్నించాడు.
ఒక నటుడిగా అందరూ తన వర్క్ గురించి మాట్లాడుకోవాలని కోరుకకుంటానని.. కానీ వ్యక్తిగత విషయాల గురించి కాదని, కానీ ఈ రంగంలో ఉన్న వారి విషయంలో ఆ విషయాలే అందరికీ ఆసక్తి కలిగించడం దురదృష్టకరమని చైతూ అన్నాడు. తాను, సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించామని.. మంచైనా, చెడైనా జనాలకు ఏదైనా విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నపుడు చెబుతామని.. తాను, సామ్ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని అనుకున్నామని.. ఐతే తాము చెప్పిన విషయానికి మించి తమ జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ చెప్పాలని తాను భావించడం లేదని చైతూ స్పష్టం చేశాడు.
తన జీవితంలో ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసని చైతూ అన్నాడు. తన గురించి ఊహాగానాలు, ప్రచారాలు తాత్కాలికమే అని.. న్యూస్ను న్యూసే రీప్లేస్ చేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. దీనిపై తానెంత స్పందిస్తే అంతగా వార్తలు పుట్టుకొస్తాయని, అందుకే సైలెంటుగా ఉన్నానని, ఏదో ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయని చైతూ అభిప్రాయపడ్డాడు.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…