గత ఏడాది కాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి చర్చ జరిగింది అక్కినేని నాగచైతన్య-సమంత జంట గురించే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇద్దరూ అధికారికంగా తమ విడాకుల గురించి ప్రకటించి పది నెలలు కావస్తున్నా.. ఇంకా తరచుగా ఈ అంశం చర్చనీయాంశంగానే ఉంటోంది.
ఈ వ్యవహారంపై మీడియాను కలిసినపుడల్లా సాధ్యమైనంత వరకు చైతూ మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ మీడియా అతడితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చైతూ-సామ్ విడాకుల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ఆసక్తి బయటి వారికి ఎందుకని అతను సూటిగా ప్రశ్నించాడు.
ఒక నటుడిగా అందరూ తన వర్క్ గురించి మాట్లాడుకోవాలని కోరుకకుంటానని.. కానీ వ్యక్తిగత విషయాల గురించి కాదని, కానీ ఈ రంగంలో ఉన్న వారి విషయంలో ఆ విషయాలే అందరికీ ఆసక్తి కలిగించడం దురదృష్టకరమని చైతూ అన్నాడు. తాను, సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించామని.. మంచైనా, చెడైనా జనాలకు ఏదైనా విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నపుడు చెబుతామని.. తాను, సామ్ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని అనుకున్నామని.. ఐతే తాము చెప్పిన విషయానికి మించి తమ జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ చెప్పాలని తాను భావించడం లేదని చైతూ స్పష్టం చేశాడు.
తన జీవితంలో ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసని చైతూ అన్నాడు. తన గురించి ఊహాగానాలు, ప్రచారాలు తాత్కాలికమే అని.. న్యూస్ను న్యూసే రీప్లేస్ చేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. దీనిపై తానెంత స్పందిస్తే అంతగా వార్తలు పుట్టుకొస్తాయని, అందుకే సైలెంటుగా ఉన్నానని, ఏదో ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయని చైతూ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on August 2, 2022 9:05 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…