గత ఏడాది కాలంగా టాలీవుడ్లో ఎక్కువగా వ్యక్తిగత విషయాల గురించి చర్చ జరిగింది అక్కినేని నాగచైతన్య-సమంత జంట గురించే. నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్త బయటికి వచ్చినప్పటి నుంచి దీని గురించి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇద్దరూ అధికారికంగా తమ విడాకుల గురించి ప్రకటించి పది నెలలు కావస్తున్నా.. ఇంకా తరచుగా ఈ అంశం చర్చనీయాంశంగానే ఉంటోంది.
ఈ వ్యవహారంపై మీడియాను కలిసినపుడల్లా సాధ్యమైనంత వరకు చైతూ మాట్లాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నాడు. కానీ మీడియా అతడితో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చైతూ-సామ్ విడాకుల గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతూ అసహనం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందనే ఆసక్తి బయటి వారికి ఎందుకని అతను సూటిగా ప్రశ్నించాడు.
ఒక నటుడిగా అందరూ తన వర్క్ గురించి మాట్లాడుకోవాలని కోరుకకుంటానని.. కానీ వ్యక్తిగత విషయాల గురించి కాదని, కానీ ఈ రంగంలో ఉన్న వారి విషయంలో ఆ విషయాలే అందరికీ ఆసక్తి కలిగించడం దురదృష్టకరమని చైతూ అన్నాడు. తాను, సమంత విడిపోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించామని.. మంచైనా, చెడైనా జనాలకు ఏదైనా విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నపుడు చెబుతామని.. తాను, సామ్ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోవాలని అనుకున్నామని.. ఐతే తాము చెప్పిన విషయానికి మించి తమ జీవితాల్లో ఏం జరిగిందన్నది ఎవరికీ చెప్పాలని తాను భావించడం లేదని చైతూ స్పష్టం చేశాడు.
తన జీవితంలో ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తెలుసని చైతూ అన్నాడు. తన గురించి ఊహాగానాలు, ప్రచారాలు తాత్కాలికమే అని.. న్యూస్ను న్యూసే రీప్లేస్ చేస్తుందని అతను వ్యాఖ్యానించాడు. దీనిపై తానెంత స్పందిస్తే అంతగా వార్తలు పుట్టుకొస్తాయని, అందుకే సైలెంటుగా ఉన్నానని, ఏదో ఒక రోజు ఇవన్నీ ఆగిపోతాయని చైతూ అభిప్రాయపడ్డాడు.
This post was last modified on August 2, 2022 9:05 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…