శ్రీమంతుడు నుంచి ఒకరకమైన సాఫ్ట్ హీరోయిజంకి అలవాటు పడిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఒకప్పటి మాస్ లో చూడాలని అభిమానులు ఎంతగా తహతహలాడిపోతున్నారో మరోసారి ఋజువయ్యింది. ఒక్కడు సినిమాని నిన్న రాత్రి రాజమండ్రి మురళీకృష్ణ థియేటర్లో ప్రత్యేకంగా రీ మాస్టర్ చేయించిన ప్రింట్ తో స్పెషల్ ప్రీమియర్ వేశారు.
ఇరవై ఏళ్ళ తర్వాత మహేష్ అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ కాకుండా ఒక జిల్లా కేంద్రంలో రీ రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో స్పందన ఎలా ఉంటుందానే డౌట్ లేకపోలేదు. ఆ అనుమానాలన్నీ బద్దలు కొడుతూ ఒక్కడు కిక్కిరిసిన ఫ్యాన్స్ మధ్య బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో షో కళకళలాడిపోయింది. చాలా మందికి టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగడం అనూహ్యం.
మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ఉన్న నేపథ్యంలో ఆ రోజు పోకిరిని ప్లాన్ చేసుకున్న అభిమానులు రెండూ ఒకే రోజు క్లాష్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆగస్ట్ మొదటి వారంలోనే ఒక్కడుని వేసుకుంటున్నారు. ఇవాళ నుంచి గుంటూరు, విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాల్లో ఒక్కడు రచ్చ చేయబోతున్నాడు.
మరోవైపు పోకిరి అడ్వాన్స్ బుకింగ్ భీభత్సమైన స్వింగ్ లో ఉంది. కాకినాడలో కేవలం తొమ్మిది నిమిషాల్లో మొత్తం ఏడు వందల టికెట్లకు పైగా అమ్ముడుపోవడం యాజమాన్యానికి సైతం షాక్ ఇచ్చింది. దీంతో రెండో స్క్రీన్ జోడించే పనిలో పడ్డారు. అసలు కొత్త సినిమాలకే జనం రాక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటుంటే ఇప్పుడీ పోకిరి, ఒక్కడు సినిమాలకు పడుతున్న నీరాజనం చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. అన్నట్టు భాగ్యనగరంలో షోల కోసం మూవీ లవర్స్ పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడెంత భీభత్సంగా ఉంటుందో వేరే చెప్పాలా..
This post was last modified on August 2, 2022 8:24 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…