Movie News

విజయ్ వారసుడికి బంద్ సెగలు

ఇవాళ్టి నుంచి టాలీవుడ్ షూటింగులు బందని నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు ఫిలిం ఛాంబర్ మద్దతు కూడగట్టుకుని నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజే స్వయంగా అనౌన్స్ చేయడంతో దాదాపుగా అన్ని చిత్రీకరణలు నిలిచిపోయాయి. విభేదిస్తున్న తెలంగాణ ఛాంబర్ తరఫున కొందరు చిన్న నిర్మాతలు యథావిధిగా తమ షూట్ లు చేసుకున్నారు.

కానీ దిల్ రాజు నిర్మాణంలోనే రూపొందుతున్న తమిళ సినిమా వారసుడు(వరిసు) వైజాగ్ షెడ్యూల్ జరుగుతున్నట్టుగా వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి ఈ సమాచారం తమకు తెలియదని ఒకవేళ నిజమైతే అలా చేయడం ముమ్మాటికి తప్పేనని అంటున్నారు. మరోవైపు ఎస్విసి టీమ్ ఇది తమిళ సినిమా కాబట్టి ఆ నిబంధన వర్తించదని చెబుతున్నారట.

ఎంత అరవ చిత్రమైనప్పటికీ పని చేస్తున్న వాళ్ళు లోకల్ యూనిట్ కాబట్టి అంత ఈజీగా ఆ వాదనను సమర్ధింపుగా చెప్పలేం. ఎందుకంటే వారసుడుని ముందు నుంచి ప్యాన్ ఇండియా బై లింగ్వల్ గానే ప్రమోట్ చేస్తున్నారు. మరిప్పుడు సింగిల్ లాంగ్వేజ్ ఎలా అయ్యిందో.

ఇప్పుడీ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. భాష ఏదైనా వారసుడులో అధిక శాతం కోలీవుడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు బంద్ చేయాలంటే కాల్ షీట్ల సమస్య రావొచ్చు. మరి దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. హైదరాబాద్ లో ప్రధాన షూటింగులన్నీ ఆపేశారు కానీ చర్చలు, దాని తాలూకు ఫలితాలు, డిస్కషన్లు రేపు ఎల్లుండి నుంచి మొదలవ్వొచ్చు. ఆగస్ట్ నుంచి భారీ విడుదలలు మొదలైన తరుణంలో ఇప్పుడీ పరిణామాలు దసరా రిలీజుల మీద తీవ్ర ప్రభావం చూపించేలా ఉన్నాయి. 

This post was last modified on August 1, 2022 8:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

41 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago