ఎన్నడూ లేనిది అమీర్ ఖాన్ తన కొత్త సినిమా లాల్ సింగ్ చడ్డా కోసం తెలుగులో చాలా విస్తృతమైన ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పర్యాయాలు హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ మీట్, చిరంజీవి ఇంట్లో స్పెషల్ ప్రీమియర్, నాగార్జునకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇలా చాలా అంటే చాలానే చేశారు. గతంలో ఎన్నడూ ఇంతలా పబ్లిసిటీ ఇవ్వలేదు. మంగళ్ పాండే, దంగల్ లాంటివి డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఈ రేంజ్ శ్రద్ధ తీసుకోలేదు.
పైగా చిరు మీద విపరీతమైన ప్రేమ అభిమానం చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదంతా చూస్తూ అభిమానులు సైతం షాకవుతున్నారు. నిజానికి ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. టాలీవుడ్ ఎన్నడూ లేనంతగా వెలిగిపోతోంది. ఈ మధ్య థియేట్రికల్ గా కొంత స్లో అయ్యింది కానీ టికెట్ రేట్లు, మంచి కంటెంట్ లాంటి విషయాల్లో మళ్ళీ కుదురుకుంటే పూర్వవైభవం వచ్చేస్తుంది.
సో ఇక్కడి మార్కెట్ ని అమీర్ ఖాన్ కమర్షియల్ కోణంలో చూస్తున్నాడు. మనవాళ్ళకు ప్రమోషన్స్ ద్వారా కనెక్ట్ అయితే ఓపెనింగ్స్ మాత్రమే కాదు కలెక్షన్ల పరంగా మంచి స్పందన వస్తుందని కెజిఎఫ్, విక్రమ్ లను చూసి అర్థం చేసుకున్నాడు. అందుకే తమిళ మలయాళం కన్నా తన ఫోకస్ ఇక్కడే ఎక్కువగా ఉంది. విచిత్రంగా అమీర్ ఈ స్థాయిలో ముంబై మీడియా ముందుకు వెళ్ళలేదు.
త్వరలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు కానీ తను ఇంత స్పెషల్ గా హైదరాబాదీ అటాచ్ మెంట్ పెంచుకోవడం అనూహ్యం. నాగ్ తో ముఖాముఖీలో అమీర్ మాట్లాడుతూ చిరుతో ఓ సినిమా తీస్తానని, అది నిర్మాతగా అయినా సరే దర్శకుడిగా అయినా సరే అంటూ ప్రోమోలో క్లూస్ ఇచ్చాడు. ఒకవేళ లాల్ సింగ్ చడ్డా కనక పెద్ద హిట్ అయితే మెగాస్టార్ కు కృతజ్ఞతగా అన్నంత పనీ చేసేలా ఉన్నాడు. ఆగస్ట్ 11 గ్రాండ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఫలితం కోసం వెయిట్ చేయడమే మిగిలింది.
This post was last modified on August 1, 2022 1:22 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…