ఎన్నడూ లేనిది అమీర్ ఖాన్ తన కొత్త సినిమా లాల్ సింగ్ చడ్డా కోసం తెలుగులో చాలా విస్తృతమైన ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు పర్యాయాలు హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ మీట్, చిరంజీవి ఇంట్లో స్పెషల్ ప్రీమియర్, నాగార్జునకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇలా చాలా అంటే చాలానే చేశారు. గతంలో ఎన్నడూ ఇంతలా పబ్లిసిటీ ఇవ్వలేదు. మంగళ్ పాండే, దంగల్ లాంటివి డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఈ రేంజ్ శ్రద్ధ తీసుకోలేదు.
పైగా చిరు మీద విపరీతమైన ప్రేమ అభిమానం చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇదంతా చూస్తూ అభిమానులు సైతం షాకవుతున్నారు. నిజానికి ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. టాలీవుడ్ ఎన్నడూ లేనంతగా వెలిగిపోతోంది. ఈ మధ్య థియేట్రికల్ గా కొంత స్లో అయ్యింది కానీ టికెట్ రేట్లు, మంచి కంటెంట్ లాంటి విషయాల్లో మళ్ళీ కుదురుకుంటే పూర్వవైభవం వచ్చేస్తుంది.
సో ఇక్కడి మార్కెట్ ని అమీర్ ఖాన్ కమర్షియల్ కోణంలో చూస్తున్నాడు. మనవాళ్ళకు ప్రమోషన్స్ ద్వారా కనెక్ట్ అయితే ఓపెనింగ్స్ మాత్రమే కాదు కలెక్షన్ల పరంగా మంచి స్పందన వస్తుందని కెజిఎఫ్, విక్రమ్ లను చూసి అర్థం చేసుకున్నాడు. అందుకే తమిళ మలయాళం కన్నా తన ఫోకస్ ఇక్కడే ఎక్కువగా ఉంది. విచిత్రంగా అమీర్ ఈ స్థాయిలో ముంబై మీడియా ముందుకు వెళ్ళలేదు.
త్వరలో ఒక ఈవెంట్ చేయబోతున్నారు కానీ తను ఇంత స్పెషల్ గా హైదరాబాదీ అటాచ్ మెంట్ పెంచుకోవడం అనూహ్యం. నాగ్ తో ముఖాముఖీలో అమీర్ మాట్లాడుతూ చిరుతో ఓ సినిమా తీస్తానని, అది నిర్మాతగా అయినా సరే దర్శకుడిగా అయినా సరే అంటూ ప్రోమోలో క్లూస్ ఇచ్చాడు. ఒకవేళ లాల్ సింగ్ చడ్డా కనక పెద్ద హిట్ అయితే మెగాస్టార్ కు కృతజ్ఞతగా అన్నంత పనీ చేసేలా ఉన్నాడు. ఆగస్ట్ 11 గ్రాండ్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఫలితం కోసం వెయిట్ చేయడమే మిగిలింది.
This post was last modified on August 1, 2022 1:22 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…