సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్తయినా యిట్టె ఫోన్లోకి వితిన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. దీంతో చాలా విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. ఇక ఏదైనా ట్రెండింగ్ న్యూస్ దొరకడం ఆలస్యం యూట్యూబర్స్ వాళ్ళ టాలెంట్ చూపిస్తూ అదిరిపోయే ట్రోలింగ్ వీడియోస్ అందిస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజాగా సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్షిప్ మేటర్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. వీళ్ళ ట్రోలింగ్ వీడియోస్ కి యూ ట్యూబ్ లో లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాన్ని మీడియా ముందు పెట్టడంతో జనాలకి టాపిక్ గా మారారు.
అయితే ఈ మేటర్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటివలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆలస్యం థియేటర్స్ లో అరుపులు కేకలు వినిపించాయి. కుర్రకారు వీరిద్దరి పాత్రలను కామెడీ చేసి పారేస్తున్నారు. నిజానికి సినిమాలో అసలు కామెడీ నే లేదు. దర్శకుడు అసలు ఈ కథలో కామెడీ పెట్టకూడదు అనుకున్నాడో ఏమో కానీ ఆ ప్రయత్నం చేయలేదు. పైగా నరేష్ , పవిత్ర లోకేష్ పాత్రలు కూడా కామెడీ పండించలేదు. ఇద్దరివీ వేరు వేరు పాత్రలు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. కానీ ఒకే ఫ్రేంలో ఇద్దరూ కనిపించడమే ఆలస్యం థియేటర్ హాలంతా నవ్వులతో సౌండ్ క్రియేట్ అయింది. రామారావు లో కామెడీ లేక పోయినా అనుకోని వీరిద్దరి స్విచువేషణ్ కామెడీ మాత్రం ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
ఈ టైంలో వీరిద్దరినీ పెట్టి ఏదైనా హిలేరియస్ ట్రాక్ రాస్తే వీళ్ళ కామెడీ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి మంచి వసూళ్ళు అందించడం ఖాయం. మరి ఏ దర్శకుడైనా ఆ దిశగా ఆలోచించి ఈ ఇద్దరి ని పెట్టి ఏదైనా రొమాంటిక్ కామెడీ ట్రాక్ పెడితే థియేటర్స్ లో ఎపిసోడ్ మాములుగా పేలదు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…