Movie News

కొత్త విలన్ టార్చర్ పెట్టేశాడు

ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ మూవీ ఏక్ విలన్ పెద్ద అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన విషయం అందరికి గుర్తే. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో రూపొంది 170 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం అప్పట్లో పెద్ద రికార్డు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా దర్శకుడు మోహిత్ సూరి సాధించిన ఈ ఫీట్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు. ఆ తర్వాత అతను ఎన్ని సినిమాలు చేసినా దీనికి వచ్చినంత పేరు రాలేకపోయింది. అందుకే మళ్ళీ దాని సీక్వెల్ తోనే హిట్టు కొట్టాలనే లక్ష్యంతో ఏక్ విలన్ రిటర్న్స్ తీశాడు.

మూడు రోజుల క్రితం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజయ్యింది. స్టార్ అట్రాక్షన్ గట్టిగానే సెట్ చేసుకున్నారు. అర్జున్ కపూర్ – జాన్ అబ్రహం – దిశా పటాని – తారా సుతారియాలతో పాటు మన శివ విలన్ జెడి చక్రవర్తి కూడా ఏసిపిగా ఓ కీలక పాత్ర చేశారు. నగరంలో లవర్స్ తో ఫస్ట్ టైం బ్రేకప్ చేసుకున్న అమ్మాయిలు హత్యకు గురవుతుంటారు. అందరికి గౌతమ్(అర్జున్ కపూర్)మీదే అనుమానం కలుగుతుంది. కానీ ఇదంతా చేస్తోంది టాక్సీ డ్రైవర్ గా పనిచేసే భైరవ్(జాన్ అబ్రహం)అని పోలీసులకు తెలియదు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. ఇంతకీ ఈ మర్డర్లు ఎందుకు జరిగాయి. వీటికి హీరోయిన్లకు కనెక్షన్ ఏంటనేది తెరమీదే చూడాలి.

పాయింట్ కొంత డిఫరెంట్ గా అనిపించినప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో మోహిత్ సూరి ఫెయిలవ్వడంతో ఈ విలన్ బాగా విసిగించేస్తాడు. చీటికీ మాటికీ వచ్చే పాటలు, ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో పెట్టిన ట్విస్టులు ఏవీ వర్కౌట్ అవ్వలేదు. ఇంతా చేసి కమల్ హాసన్ ఎర్రగులాబీలతో మొదలుకుని గోపీచంద్ ఒంటరి దాకా ఎన్నో సినిమాల నుంచి స్ఫూర్తి చెందిన మోహిత్ రెండు గంటలు నిడివే ఉన్న భరించలేని కళాఖండాన్ని కానుకగా అందించాడు. షంషేరా దెబ్బకు కుదేలైన హిందీ బాక్సాఫీస్ కు ఈ విలన్ కొత్తగా జోష్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.

This post was last modified on July 31, 2022 11:05 am

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

18 mins ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

1 hour ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

1 hour ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

3 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

4 hours ago