కెరీర్ మొదలు పెట్టిన తొలి నాళ్ళ లో కార్తీకి తెలుగులో అంతగా గుర్తింపు లేదు కానీ నా పేరు శివతో తొలి హిట్టు కొట్టాక ఫాలోయింగ్ పెరగడం మొదలయ్యింది. ఆ తర్వాత ఖాకీ, నాగార్జునతో చేసిన ఊపిరి మంచి బ్రేక్ ఇచ్చాయి. క్రమంగా పలకరించిన ఫ్లాపులు మార్కెట్ ని కొంత దెబ్బ తీసినప్పటికీ ఖైదీ రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ తిరిగి ఊపిరి పోసింది. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకునే అతి తక్కువ తమిళ హీరోల్లో కార్తీనే ఫస్టు. ఆ మధ్య వచ్చిన సుల్తాన్ ఫలితం నిరాశపరిచినా ఇప్పుడు రాబోయే వాటి మీద చెప్పుకోదగ్గ బజ్ అయితే ఉంది.
ఉన్నట్టుండి నిన్న విరుమన్ విడుదల తేదీని ఆగస్ట్ 12 అని ప్రకటించి యూనిట్ షాక్ ఇచ్చింది. పట్టుమని రెండు వారాలు కూడా టైం లేని పరిస్థితిలో ప్రమోషన్లు ఎలా చేస్తారనే అనుమానం అభిమానుల్లో కలిగింది. పైగా పోటీ కూడా తీవ్రంగా ఉంది. అయితే ఈ హఠాత్ నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది ఆ స్లాట్ లో రావాలనుకున్న విశాల్ లాఠీ ఎప్పుడో రేస్ నుంచి తప్పుకుంది. ముందు వస్తామని చెప్పిన విక్రమ్ కోబ్రా నాన్చి నాన్చి చివరికి చేతులు ఎత్తేసింది. ఈ రెండు డ్రాప్ అయ్యాక ఆ గ్యాప్ ఖాళీ అయ్యింది.
ఇండిపెండెన్స్ డేకు ఏకంగా నాలుగు రోజుల సెలవులు కలిసిరావడం విరుమన్ వాడుకోవాలని డిసైడ్ అయ్యింది.. లాల్ సింగ్ చడ్డాకు అక్కడ పెద్ద బజ్ ఏమి లేదు. మాచర్ల నియోజకవర్గం ఇక్కడికే పరిమితం. కార్తికేయ 2 వల్ల కార్తీకి వచ్చిన థ్రెట్ ఉండదు. సో అంత సుదీర్ఘమైన వీకెండ్ ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే తెలుగు మార్కెట్, థియేటర్ కౌంట్ పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుంటున్నారు. అన్నట్టు విరుమన్ టైటిల్ ని తెలుగులో పెడతారా లేక తలైవి, వలిమై లాగా అలాగే ఉంచేసి మేమింతే అంటారా చూడాలి.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…