భానుమతి రామకృష్ణ.. అల్లువారి ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమ్ కాబోతున్న సినిమా. నవీన్ చంద్ర, సలోని లూత్రా జంటగా నటించారు. 30 ప్లస్ వయసులో ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. శ్రీకాంత్ నగోతి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.
ఐతే విడుదల ముంగిట ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. భానుమతి, రామకృష్ణల తనయుడు ఈ సినిమా టైటిల్ విషయమై కోర్టుకెక్కారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేశాడు. ఈ పేరు పెట్టేముందు తమ కుటుంబ అనుమతి తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.
అతను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన కోర్టు తనకు అనుకూలంగా ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఈ సినిమా టైటిల్ మార్చాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
ఐతే ఇంకొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుండగా.. టైటిల్ మార్చమని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. ఈ రోజు సాయంత్రం నాలుగున్నరకు నేచురల్ స్టార్ నాని ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నాడు. అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈలోపు టైటిల్ మార్చి.. దాన్ని డిజైన్ చేసి సినిమా టైటిల్ కార్డ్స్లో చేరుస్తారేమో చూడాలి.
గత ఏడాది హరీష్ శంకర్-వరుణ్ తేజ్ల సినిమా ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో ఇబ్బంది తలెత్తితే విడుదలకు ముందు రోజే టైటిల్ మార్చారు. ‘గద్దలకొండ గణేష్’ అని పేరు మార్చి.. రాత్రికి రాత్రి టైటిల్ కార్డ్స్లోనూ దాన్ని చేర్చి.. కొత్త పోస్టర్లు కూడా వదిలారు. ఎలాగూ ‘భానుమతి రామకృష్ణ’కు థియేట్రికల్ రిలీజ్ లేదు. ఓటీటీ రిలీజ్ కాబట్టి మార్పు మరీ కష్టమేమీ కాకపోవచ్చు. ఈ రోజు రాత్రికే దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.
This post was last modified on July 2, 2020 5:35 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…