వచ్చే నెల 12న విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. గత ఏడాది చెక్, రంగ్ దేలు థియేట్రికల్ గా బాగా నిరాశపరిచాయి. మాస్ట్రో ఓటిటిలో వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అది కూడా ఈ లిస్టులోనే చేరేది.
మాచర్లలో మాస్ ని టార్గెట్ చేసి మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ మిక్స్ తో హిట్టు కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. లాల్ సింగ్ చడ్డా, కార్తికేయ 2లు పోటీ పడుతున్నప్పటికీ వాటి కంటెంట్ తో పోలిస్తే మాచర్లకే రెగ్యులర్ ఆడియన్స్ మద్దతు ఎక్కువ దక్కే అవకాశం ఉంది
ఇందులో నితిన్ ఐఎఎస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. అయితే ఇది నిర్మాణంలో ఉన్నప్పుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ విడుదలయ్యింది. ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది. అందులోనూ హీరో పాత్ర కలెక్టరే. కథ పరంగా కొన్ని సారూప్యతలు ఉండటంతో అవి గుర్తుకు రాకుండా కీలక మార్పులతో మాచర్లకు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారట. ఆ కారణంగానే కొంత ఆలస్యమయ్యిందనే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో ఉంది.
ఇద్దరు యువ హీరోలు ఒకే పాత్ర చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. అందుకే మాచర్లకు రిపేర్లు జరిగాయని తెలిసింది. ఇప్పటికైతే అంజలి చేసిన ఐటెం సాంగ్ రారా రెడ్డి బాగా రీచ్ అయ్యింది. నితిన్ కృతి శెట్టిల పాట ఒకటి ఏకంగా ఫుల్ వీడియో రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు.
ఇవాళ రాబోతున్న ట్రైలర్ ని బట్టి అంచనాల మోతాదు పెరగడమో తగ్గడమో ఉంటుంది. స్వంత బ్యానర్ లో ఇటీవలే విక్రమ్ రూపంలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఫ్యామిలీకి ఇప్పుడిదీ హిట్ అయితే డబుల్ జాక్ పాట్ కొట్టినట్టే. చూద్దాం
This post was last modified on July 30, 2022 5:36 pm
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…