విశాల్ కొత్త సినిమా లాఠీ వాస్తవానికి వచ్చే నెల 12న విడుదల కావలసింది. అయితే సాంకేతిక కారణాలతో పాటు షూటింగ్ పెండింగ్ ఉండటంతో సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. నిన్న టీజర్ ని వదిలారు. ఖాకీ దుస్తుల్లో విశాల్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సెల్యూట్ లో ఇలాంటి పాత్ర చేశాడు కానీ ఇందులో సెటప్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది. విశాల్ కు చక్ర, సామాన్యుడు రెండూ వరుస షాకులు ఇచ్చాయి. అభిమన్యుడు ఇచ్చిన కంబ్యాక్ ని నిలబెట్టుకోవడంలో విశాల్ తడబడుతున్నట్టు ఫలితాలే చెబుతున్నాయి.
సరే ఇక లాఠీ విషయానికి వస్తే మగధీరకు దీనికి కనెక్షన్ ఏంటనుకునున్నారా. మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. టీజర్ లో ఓ ఫైట్ చూపించారు. ఓ పెద్ద పాడు బడిన భవంతి. అక్కడికి నగరంలో పేరుమోసిన రౌడీల దగ్గర్నుంచి చిన్న చితక గూండాల దాకా అందరూ వస్తారు. వాళ్ళ టార్గెట్ హీరో ఒక్కడే. వీళ్ళేమో వందల్లో ఉంటారు. మనోడు ఒక్కడు. అయినా భయపడకుండా రండ్రా కాసుకుందాం ఒక్కణ్ణీ వదిలిపెట్టనని సవాల్ విసిరి లాఠీ పట్టుకుని వాళ్ళ మీదకు దూకుతాడు. అన్నట్టే ఎవరినీ వదలకుండా బాది పారేస్తాడు.
ఇది రాజమౌళి వాడిన ఫార్ములాని వేరే చెప్పాలా. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లోనూ రామ్ చరణ్ వేసిన రామరాజు పాత్ర వేల మందిని కొట్టుకుంటూ ఆఫీసర్ చెప్పిన వాడిని పట్టుకోవడం చూశాం. వీటినే మిక్స్ చేస్తూ దర్శకుడు వినోద్ కుమార్ ఇలా లాఠీ కోసం వాడేసుకున్నాడు. మాస్ కి కనెక్ట్ అయ్యేలా బాగానే కట్ చేశారు కానీ ఈ లాఠీ అయినా విశాల్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి. అన్నట్టు ఈ టైటిల్ మహేష్ బాబు ఒక్కడు దర్శకుడు గుణశేఖర్ డెబ్యూ మూవీకి పెట్టింది. అప్పట్లో అది పెద్దగా ఆడలేదు.
This post was last modified on July 25, 2022 5:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…