ఫ్యాన్ వార్స్కు కాదేదీ అనర్హం అంటూ తాజాగా మహేష్ అభిమానులు, మిగతా హీరోల అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో తమకు సంబంధం లేని సినిమా విషయంలో తెగ కొట్టేసుకుంటున్నారు. ఆ సినిమా.. థాంక్యూ కావడం గమనార్హం. ఇది మహేష్ సినిమా కాదు. అతడికి ఏ రకంగానూ ఈ సినిమాతో సంబంధం లేదు. మహేష్ ఫ్యాన్స్తో గొడవ పడుతున్న వేరే హీరోల అభిమానులకు కూడా దీంతో సంబంధం లేదు. అయినా సరే ఇరు వర్గాల మధ్య వార్ ఒక రేంజిలో నడుస్తోంది. ఇందుకు కారణం.. ‘థాంక్యూ’ సినిమాలో మహేష్ బాబు రెఫరెన్సులు ఉండడమే.
ఇందులో నాగచైతన్య మహేష్కు వీరాభిమానిగా నటించాడు. థియేటర్లలో మహేష్ సినిమాలు చూస్తూ, బయట కటౌట్లు అవీ పెట్టి సెలబ్రేషన్స్ చేస్తూ హంగామా చేసే అభిమాని అన్నమాట అతను.
‘థాంక్యూ’ షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే చైతూ ఇందులో మహేష్ డైహార్డ్ ఫ్యాన్గా నటిస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. మహేష్ కటౌట్ ముందు చైతూ హడావుడి చేస్తున్న ఆన్ లొకేషన్ పిక్స్ కూడా బయటికి వచ్చాయి. దీంతో అప్పట్నుంచి మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. రిలీజ్ ముంగిట సంబంధిత సీన్ల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.
హీరో మహేష్ అభిమానిగా ఉంటే ఆ సినిమా ఏ రేంజికి వెళ్తుందో చూస్తారంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు సవాళ్లు విసిరారు. అవతలి వర్గం అదీ చూద్దాం అంటూ సినిమా విడుదల కోసం ఎదురు చూసింది. సినిమాలో మహేష్ ఫ్యాన్ బాయ్గా చైతూ కనిపించే సన్నివేశాలు బాగానే వచ్చినా.. సినిమాకు అవేవీ అంత ప్లస్ కాలేదు. రిలీజ్ తర్వాత మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని ఓన్ చేసుకోవట్లేదు. ‘థాంక్యూ’కు దారుణమైన ఓపెనింగ్స్ వస్తుండడంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ ఆ హీరోను, తన అభిమానులను టార్గెట్ చేశారు. మహేష్ రెఫరెన్సులు గట్టిగా ఉన్న సినిమా సత్తా ఇదంటూ ఎద్దేవా చేస్తున్నారు. మహేష్ అభిమానులేమో అనవసరంగా ఈ సినిమాను మోసి ఇరుక్కుపోయాం అంటూ ఫీలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2022 8:26 pm
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…