Movie News

టిల్లు 2 బాధ్యతలు రామ్ కు ఇచ్చారట?

ఈ ఏడాది ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి ఇటీవలే సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింపుల్ బడ్జెట్ తో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా కేవలం ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని తీసిన ఈ మూవీ ముఖ్యంగా యూత్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో చూశాం. దెబ్బకు హీరో సిద్ధూ జొన్నలగడ్డ గ్రాఫ్ మారిపోయింది. ఏళ్ళ తరబడి ఎదురు చూసిన బ్రేక్ ఒక్క టిల్లుతో వచ్చేసింది. ఈ కారణంగానే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఓ సినిమాను రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చి మరీ వద్దనుకున్నాడనే టాక్ ఉంది.

ఇక మొదటి భాగం సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడీ సెకండ్ పార్ట్ కి కెప్టెన్ గా వ్యవహరించడం లేదని లేటెస్ట్ అప్ డేట్. అతని స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. ఆ మధ్య తేజ సజ్జ – శివాని రాజశేఖర్ లతో అద్భుతం తీసింది ఇతనే. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడంతో దాని బాక్సాఫీస్ స్టామినా బయటపడకపోయినా టేకింగ్ పరంగా మంచి పేరే వచ్చింది. అందుకే ఇప్పుడీ టిల్లు 2 బాధ్యతలు మల్లిక్ రామ్ కు ఇచ్చారట. కథ స్క్రీన్ ప్లే మాటలు ముందులాగే సిద్దు జొన్నలగడ్డనే స్వయంగా రాసుకున్నాడు.

విమల్ కృష్ణ తప్పుకోవడానికి కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఏవో అంటారు స్టాండింగ్ ఇష్యూస్ అని ఇన్ సైడ్ టాక్. సిద్దుది నెక్స్ట్ మూవీ ఇదే వస్తుందా లేక దానికన్నా ముందు మరొకటి ఏదైనా ఉంటుందానే క్లారిటీ ఇంకా రాలేదు. సితార బ్యానర్ ఈసారి బడ్జెట్ కూడా పెంచబోతున్నారట. హీరోయిన్ నేహా శెట్టి పాత్రను తగ్గించి మరో కొత్త భామను జోడించబోతున్నారని గతంలో లీకైన వార్త చక్కర్లు కొట్టింది. బాహుబలి, కెజిఎఫ్ తప్ప సీక్వెల్స్ కి పెద్దగా హిట్ రికార్డు లేని సౌత్ లో డీజే టిల్లు దాన్ని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి

This post was last modified on July 24, 2022 12:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

33 mins ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

2 hours ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

4 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

4 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

4 hours ago