రేపు విడుదల కాబోతున్న థాంక్ యు ప్రమోషన్ చివరి దశకు వచ్చేసింది. అక్కినేని అభిమానుల కన్నా చైతు నిర్మాత దిల్ రాజులు ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాని గ్యాంగ్ లీడర్ చేసిన గాయం దీంతో మానుతుందనే నమ్మకం దర్శకుడు విక్రమ్ కె కుమార్ లో కనిపిస్తోంది. అయితే ఇవాళ రాత్రే కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేయడం అనుకోకుండా వచ్చిన ట్విస్టు. నెల్లూరు, భీమవరం, విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో అఫీషియల్ గా అనౌన్స్ చేయగా రెండు గంటల క్రితం కర్నూలు కూడా జోడించారు.
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సెంటర్లు. అనూహ్యంగా నైజామ్ కేంద్రం లేకపోవడం మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది. ఒకవేళ అలాంటి ప్లానింగ్ ఏదైనా ఉన్నా ఈపాటికే చేసి ఉండాలి. ఆన్ లైన్లో టికెట్ అమ్మకాలు మొదలుపెట్టాలి. కానీ అదేమీ జరగలేదు. ఏరియా పక్కనపెడదాం. కనీసం హైదరాబాద్ లోనూ ఎలాంటి ప్రీమియర్లు వేస్తున్న దాఖలాలు లేవు. ఫస్ట్ షో రేపు ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8.45కు ఎప్పటిలాగే పడనుంది. మరి భాగ్యనగరంలోనూ ముందు రోజు ఎందుకు వేయడం లేదనే ప్రశ్న చైతు ఫ్యాన్స్ లో మెదులుతోంది
కారణమేంటో అంతు చిక్కడం లేదు. యుఎస్ కన్నా ముందే ఏపిలో షోలు పూర్తయిపోతాయి. టాక్ అయితే బయటికి వస్తుంది. వేస్తున్నవి కూడా పెద్ద జిల్లా కేంద్రాలే. ఇదే తరహాలో నైజామ్ లోనూ వేసుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దిల్ రాజు టీమ్ మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ల ఆసక్తి మీద ఈ షోలు ఆధారపడి ఉంటాయంటే అదేదో ప్రాంతాన్ని బట్టి ఉండదుగా. పైగా థాంక్ యు వందల కోట్లతో తీసిన గ్రాండియర్ కాదు. అలాంటప్పుడు ఒక రాష్ట్రానికే ఎందుకు పరిమితం చేసినట్టో .
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…