హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ‘కార్తికేయ 2’ కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజు నితిన్ మాస్ మూవీ ‘మాచర్ల నియోజిక వర్గం’ రిలీజ్ అవ్వనుంది. సమంత యశోద కూడా వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ సోలో రిలీజ్ కోసం చాలా వెయిట్ చేశాడు. ఎట్టకేలకు జులై 22న ఫిక్స్ చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. కానీ ఉన్నపళంగా ‘థాంక్యూ’ ని జులై 8 నుండి జులై 22 కి తనకి కన్వినెంట్ గా పోస్ట్ పోన్ చేసుకున్నారు దిల్ రాజు.
దీంతో నిఖిల్ పక్కకి తప్పుకోక తప్పలేదు. అలా చైతు కి సైడ్ ఇచ్చిన నిఖిల్ మళ్ళీ ఆగస్ట్ 5న ఒక డేట్ అనుకున్నాడు. కానీ ఆ డేట్ కి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫిక్సయింది. దాంతో ఇంకా ఎనౌన్స్ చేయకుండానే నిఖిల్ తన ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకసారి చైతు సినిమా కోసం మరోసారి కళ్యాణ్ రామ్ సినిమా కోసం కార్తికేయ 2 వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఫైనల్ గా ఇప్పుడు నితిన్ సినిమాతో పోటీ పడబోతున్నాడు.
కార్తికేయ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై కొంత బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం. పైగా అనుపమ క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. చూడాలి మరి నితిన్ తో పోటీ పడి నిఖిల్ హిట్ కొడతాడా లేదా ?
This post was last modified on July 20, 2022 9:53 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…