మెగా స్టార్ చిరు తన కెరీర్ లో ఎక్కువ మల్టీ స్టారర్లు చేయలేదు. దానికి కొన్ని రీజన్ ఉన్నాయి. చిరు చేసిన 150 సినిమాల లిస్టులో చాలా అరుదుగా మల్టీ స్టారర్స్ కనిపిస్తాయి. అయితే ఇప్పుడు చిరు రూటు మార్చాడని, చేస్తున్న నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు ఇతర హీరోల సపోర్ట్ తీసుకుంటున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మెగా స్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ముంబైలో చిరు -సల్మాన్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఇంకా కొంత షూట్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో ఓ సాంగ్ పెట్టబోతున్నారు మేకర్స్. తమన్ ఓ సాంగ్ రెడీ చేసి రికార్డింగ్ కూడా ఫినిష్ చేశాడు.
ఇక బాబీ డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ రోల్ లో కనిపించనున్నాడు. గతంలో చిరంజీవి ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా కనిపించిన రవితేజ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా స్టార్ తో కలిసి నటిస్తున్నాడు. ఇటివలే షూటింగ్ లో పాల్గొన్నాడు కూడా. అయితే రవితేజ ఎంట్రీతో సినిమాకు మంచి బజ్ వచ్చింది. అన్నయ్య టైంలో రవితేజ కి హీరోగా ఇమేజ్ లేదు. కేరెక్టర్స్ చేస్తూ బండి లాగిస్తున్న టైం అది. కానీ ఇప్పుడు లెక్క మారింది. రవితేజ కి ఓ సెపరేట్ ఇమేజ్ తో పాటు మార్కెట్ ఉంది. కోవిడ్ తర్వాత ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో చిరు ప్రాజెక్ట్ కి రవితేజ కచ్చితంగా హెల్ప్ అవుతాడు.
ఇలా చేస్తున్న రెండు సినిమాల్లో ఇద్దరు స్టార్ హీరోలతో చిరు కలిసి పనిచేయడాన్ని యాంటీ ఫ్యాన్స్ సపోర్ట్ గా భావిస్తున్నారు. మెగా ఇమేజ్ తో కలెక్షన్స్ రావడం కష్టమని భావిస్తూ ఇలా ఇతర హీరోల సపోర్ట్ తో చిరు సినిమాలు చేసి మార్కెట్ రీ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి సల్మాన్ , రవితేజ సపోర్ట్ తో చిరు ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటారో ? ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే చిరుకి దక్కే క్రెడిట్ ఎంత అనేది వేచి చూడాలి.
This post was last modified on July 19, 2022 11:41 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…