ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న నాగ చైతన్య థాంక్ యు బజ్ కోసం బాగా కష్టపడుతోంది. చైతుకున్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఓపెనింగ్ గురించిన టెన్షన్ లేదు కానీ వసూళ్లు కొంచెం గట్టిగా రావాలంటే మాత్రం మొదటి మూడు రోజుల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. యూనిట్ ప్రమోషన్ పరంగా చేయాల్సిందంతా చేస్తోంది కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. ముఖ్యంగా ప్రేమమ్, నా ఆటోగ్రాఫ్, మజిలీ సినిమాల తాలూకు షేడ్స్ కనిపించడం సాధారణ ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ని తగ్గిస్తోంది.
అందుకే హైప్ కోసం ఏ అవకాశాన్ని టీమ్ వదిలిపెట్టడం లేదు. ఇందులో చైతు మహేష్ బాబు వీరాభిమానిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాలేజీ బ్యాక్ డ్రాప్ మొదలయ్యాక ఈ సన్నివేశాలు వస్తాయి. రచయిత బివిఎస్ రవి దీన్ని నొక్కి చెబుతూ ఒక్కడు, పోకిరి, దూకుడు ఈ మూడు సినిమాల రెఫరెన్సులు థాంక్ యులో ఉంటాయని ప్రత్యేకంగా ట్వీట్ చేయడం ప్రిన్స్ ఫ్యాన్స్ కి గేలం వేయడానికేనని అర్థమవుతోంది. నిజంగా వాళ్ళు మద్దతు ఇచ్చే పనైతే ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద పాజిటివ్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
కానీ ఈ ఒక్క పాయింట్ తోనే అంచనాలు పెంచలేం కానీ ఏదో రకంగా సోషల్ మీడియాలో టాపిక్ గా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన థాంక్ యులో రాశిఖన్నా మెయిన్ హీరోయిన్. అంచనాల సంగతి పక్కనపెడితే బాక్సాఫీస్ వద్ద సోలో రిలీజ్ దక్కించుకోవడం చైతుకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. ముందు అనుకున్న కార్తికేయ 2 తప్పుకుంది. పోటీ ఉన్న శంషేరా మీద తెలుగులో ఏమంత హైప్ లేదు. సో ఈ అవకాశాన్ని సరైన కంటెంట్ తో వాడుకుంటే హిట్టు కొట్టినట్టే.
This post was last modified on July 17, 2022 9:20 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…