Movie News

ఆదిపురుష్.. ఈ కబురు చెప్పారు చాలు

‘తానాజీ’ లాంటి భారీ చిత్రం చేసిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో మన ప్రభాస్ భారీ బడ్జెట్లో సినిమా చేస్తున్నాడని చాలా సంబరపడ్డారు అప్పట్లో అభిమానులు. కానీ ఈ సినిమా ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ కాలేదు ఆ సినిమా నుంచి. షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సినిమా నుంచి ఇంతవరకు ఒక్క ప్రోమో కూడా లాంచ్ చేయకపోవడం పట్ల ప్రభాస్ అభిమానుల ఆగ్రహం మామూలుగా లేదు.

సోషల్ మీడియాలో దర్శకుడు ఓం రౌత్ అండ్ టీంను తిట్టి తిట్టి అలసిపోయి ఊరుకుండిపోయారు వాళ్లు. అసలే ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత రెండు పెద్ద డిజాస్టర్లు ఎదుర్కొని ఇబ్బందుల్లో ఉంటే.. ‘ఆదిపురుష్’కు బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం విఫలమవుతోందనేది వాళ్ల బాధ. కానీ ఓం రౌత్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజాగా అతను అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అప్‌డేట్ ఇచ్చాడు.

ఓం రౌత్ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నాడు. అక్కడ ఒక భారీ ఐమాక్స్ థియేటర్ ముందు నిలుచుని 2023 జనవరి 12వ తేదీ కోసం ఆగలేకపోతున్నట్లు వ్యాఖ్యానించాడు. తద్వారా తాను ‘ఆదిపురుష్’ పనిలోనే ఉన్నానని, ఈ సినిమా ముందు అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజవుతుందని రౌత్ క్లారిటీ ఇచ్చేసినట్లయింది. చాన్నాళ్లుగా అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో రాదో అన్న అనుమానంలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చేసినట్లే.

ఇక ఓం రౌత్ ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నది ‘ఆదిపురుష్’ ఐమాక్స్ త్రీడీ వెర్షన్ టెస్టింగ్ కోసమే అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో, త్రీడీ-ఐమాక్స్ వెర్షన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి అంతా క్లియర్‌గా ఉండేలా ఓం రౌత్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ప్రాడక్ట్‌ను పక్కాగా రెడీ చేశాకే ప్రమోషన్లు మొదలుపెట్టాలని అతను భావిస్తుండొచ్చు.

This post was last modified on July 15, 2022 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

7 minutes ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

22 minutes ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

45 minutes ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

46 minutes ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

4 hours ago

బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…

4 hours ago