యువ కథానాయకుడు రామ్ నటించిన ‘ది వారియర్’ సినిమా గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు టాక్ ఆశించిన స్థాయిలో లేదు. లింగుస్వామి ఒకప్పుడు తీసిన సినిమాల స్థాయిలో ఇది లేదని, ఆయన ముద్ర కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ ఎనర్జీని ఆయన వాడుకోలేదనే కామెంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి మిక్స్డ్ టాక్తో మొదలైన ఈ సినిమా అంతిమంగా ఎలాంటి ఫలితాన్నందుకుంటో చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. సినిమాలోని ఒక డైలాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో చిన్న చర్చకు కూడా దారి తీసింది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే.. ‘‘రాజకీయాల్లోకి పోతున్నాం కదా.. వెన్నుపోటు పొడిచేది నేర్చుకుంటున్నా’’. ఇందులో విలన్ పాత్ర చేసిన ఆది పినిశెట్టి చెప్పిన డైలాగ్ అది. అతను ‘ది వారియర్’లో రౌడీ పాత్ర చేశాడు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట ఈ డైలాగ్ వస్తుంది.
రాజకీయాల్లో వెన్నుపోట్లు అనేది సర్వ సాధారణమే కావచ్చు. ప్రతి పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉండొచ్చు. కానీ ఈ పదం బాగా ఫేమస్ అయింది. ఎక్కువ మంది దాన్ని ఎటాచ్ చేసి చూసేది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలోనే. సీనియర్ ఎన్టీఆర్కు ఆయన వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారనే అపప్రదను ఆయన దశాబ్దాల నుంచి మోస్తున్నారు. అప్పుడు ఆయన ఎందుకు అలా చేశారు.. దాని మీద జనాల అభిప్రాయం ఏంటి అన్నది పక్కన పెడితే.. ప్రత్యర్థులు మాత్రం తరచుగా ఈ విషయాన్ని తెరపైకి తెస్తుంటారు.
ఐతే ఈ వెన్నుపోటు డైలాగ్ ఇప్పుడు రామ్ సినిమాలో రావడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడి మావయ్య అయిన రమేష్ బాబు తెలుగుదేశం మద్దతుదారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఆయన ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుని కొంతమంది చనిపోవడం.. ఆ సమయంలో, తర్వాత జగన్ సర్కారు టార్గెట్ చేయడం గురించీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసేలా రామ్ సినిమాలో డైలాగ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ డైలాగ్ రామ్కు తెలిసే సాయిమాధవ్ బుర్రా రాశారా.. రామ్ దాన్ని ఓకే చేశాడా.. లేక తెలియకుండా ఇరికించేశారా అన్నదే డౌట్.
This post was last modified on July 15, 2022 9:27 am
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…