మాములుగా పేరున్న ఆర్టిస్టుల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉంటుంది. ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయిపల్లవి గార్గి, ప్రభుదేవా మై డియర్ భూతం రెండు డబ్బింగ్ వెర్షన్లు శుక్రవారం విడుదలవుతున్నాయి. కానీ అవొస్తున్న దాఖలాలు కానీ, ప్రేక్షకులు ఆసక్తి చూపించే సూచనలు కానీ ఏవీ లేవు. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్లు గట్రా చేసినా లాభం లేకపోతోంది.
ఇదంతా కాదు కానీ అసలు ది వారియర్ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీటికి ఆశించడం అత్యాశే అవుతుంది. గురువారం రిలీజ్ ఉంటే బుధవారం రాత్రికి హైదరాబాద్ మొత్తానికి కేవలం ఇరవై శాతం లోపే టికెట్లు తెగాయంటేనే జనాల అనాసక్తి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ముందు వర్షమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరుణ దేవుడి విశ్వరూపమే కనిపిస్తోంది. జనాలు గల్లంతవుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలాంటి సిచువేషన్ లో జనం థియేటర్లకు రావాలనుకోవడం సబబు కాదు కానీ అలా అని అన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. గార్గి కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే సీరియస్ మూవీ కాగా మై డియర్ భూతం చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం. ఫిదా టైంలో సాయిపల్లవి, ప్రేమికుడు ట్రెండ్ లో ప్రభుదేవా ఒకప్పుడు వీళ్ళ ఇమేజే పబ్లిక్ ని హాలు దాకా లాకొచ్చింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది. అయినా ఇకపై మన సినిమా ఓటిటికి పనికొస్తుందా లేక థియేటర్ బొమ్మనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం అవసరం.
This post was last modified on July 14, 2022 9:19 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…