మాములుగా పేరున్న ఆర్టిస్టుల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉంటుంది. ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయిపల్లవి గార్గి, ప్రభుదేవా మై డియర్ భూతం రెండు డబ్బింగ్ వెర్షన్లు శుక్రవారం విడుదలవుతున్నాయి. కానీ అవొస్తున్న దాఖలాలు కానీ, ప్రేక్షకులు ఆసక్తి చూపించే సూచనలు కానీ ఏవీ లేవు. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్లు గట్రా చేసినా లాభం లేకపోతోంది.
ఇదంతా కాదు కానీ అసలు ది వారియర్ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీటికి ఆశించడం అత్యాశే అవుతుంది. గురువారం రిలీజ్ ఉంటే బుధవారం రాత్రికి హైదరాబాద్ మొత్తానికి కేవలం ఇరవై శాతం లోపే టికెట్లు తెగాయంటేనే జనాల అనాసక్తి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ముందు వర్షమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరుణ దేవుడి విశ్వరూపమే కనిపిస్తోంది. జనాలు గల్లంతవుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలాంటి సిచువేషన్ లో జనం థియేటర్లకు రావాలనుకోవడం సబబు కాదు కానీ అలా అని అన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. గార్గి కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే సీరియస్ మూవీ కాగా మై డియర్ భూతం చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం. ఫిదా టైంలో సాయిపల్లవి, ప్రేమికుడు ట్రెండ్ లో ప్రభుదేవా ఒకప్పుడు వీళ్ళ ఇమేజే పబ్లిక్ ని హాలు దాకా లాకొచ్చింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది. అయినా ఇకపై మన సినిమా ఓటిటికి పనికొస్తుందా లేక థియేటర్ బొమ్మనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం అవసరం.
This post was last modified on July 14, 2022 9:19 am
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…