మాములుగా పేరున్న ఆర్టిస్టుల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉంటుంది. ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయిపల్లవి గార్గి, ప్రభుదేవా మై డియర్ భూతం రెండు డబ్బింగ్ వెర్షన్లు శుక్రవారం విడుదలవుతున్నాయి. కానీ అవొస్తున్న దాఖలాలు కానీ, ప్రేక్షకులు ఆసక్తి చూపించే సూచనలు కానీ ఏవీ లేవు. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్లు గట్రా చేసినా లాభం లేకపోతోంది.
ఇదంతా కాదు కానీ అసలు ది వారియర్ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీటికి ఆశించడం అత్యాశే అవుతుంది. గురువారం రిలీజ్ ఉంటే బుధవారం రాత్రికి హైదరాబాద్ మొత్తానికి కేవలం ఇరవై శాతం లోపే టికెట్లు తెగాయంటేనే జనాల అనాసక్తి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ముందు వర్షమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరుణ దేవుడి విశ్వరూపమే కనిపిస్తోంది. జనాలు గల్లంతవుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలాంటి సిచువేషన్ లో జనం థియేటర్లకు రావాలనుకోవడం సబబు కాదు కానీ అలా అని అన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. గార్గి కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే సీరియస్ మూవీ కాగా మై డియర్ భూతం చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం. ఫిదా టైంలో సాయిపల్లవి, ప్రేమికుడు ట్రెండ్ లో ప్రభుదేవా ఒకప్పుడు వీళ్ళ ఇమేజే పబ్లిక్ ని హాలు దాకా లాకొచ్చింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది. అయినా ఇకపై మన సినిమా ఓటిటికి పనికొస్తుందా లేక థియేటర్ బొమ్మనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం అవసరం.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…