మాములుగా పేరున్న ఆర్టిస్టుల సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉంటుంది. ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. సాయిపల్లవి గార్గి, ప్రభుదేవా మై డియర్ భూతం రెండు డబ్బింగ్ వెర్షన్లు శుక్రవారం విడుదలవుతున్నాయి. కానీ అవొస్తున్న దాఖలాలు కానీ, ప్రేక్షకులు ఆసక్తి చూపించే సూచనలు కానీ ఏవీ లేవు. ఇద్దరూ హైదరాబాద్ కు వచ్చి మరీ ప్రమోషన్లు గట్రా చేసినా లాభం లేకపోతోంది.
ఇదంతా కాదు కానీ అసలు ది వారియర్ బుకింగ్సే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు వీటికి ఆశించడం అత్యాశే అవుతుంది. గురువారం రిలీజ్ ఉంటే బుధవారం రాత్రికి హైదరాబాద్ మొత్తానికి కేవలం ఇరవై శాతం లోపే టికెట్లు తెగాయంటేనే జనాల అనాసక్తి కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం ముందు వర్షమే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరుణ దేవుడి విశ్వరూపమే కనిపిస్తోంది. జనాలు గల్లంతవుతున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలాంటి సిచువేషన్ లో జనం థియేటర్లకు రావాలనుకోవడం సబబు కాదు కానీ అలా అని అన్నీ వాయిదా వేసే పరిస్థితి లేదు. గార్గి కోర్ట్ రూమ్ డ్రామాగా సాగే సీరియస్ మూవీ కాగా మై డియర్ భూతం చిన్నపిల్లలను టార్గెట్ చేసిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం. ఫిదా టైంలో సాయిపల్లవి, ప్రేమికుడు ట్రెండ్ లో ప్రభుదేవా ఒకప్పుడు వీళ్ళ ఇమేజే పబ్లిక్ ని హాలు దాకా లాకొచ్చింది. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది. అయినా ఇకపై మన సినిమా ఓటిటికి పనికొస్తుందా లేక థియేటర్ బొమ్మనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం అవసరం.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…