ఇంకో రెండే వారాల్లో మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ విడుదల కానుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. దర్శకుడు శరత్ మండవ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు కానీ హీరో ఇంకా రంగంలోకి దిగలేదు. ఖిలాడీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రవితేజ ఫ్యాన్స్ కు దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. టీజర్ ఓ మోస్తరుగా పర్లేదనిపించినప్పటికీ ఓవరాల్ గా సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడంలో తడబడింది. ఈ కారణంగానే బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.
ఇదంతా మారాలంటే రామారావు అదే రవితేజ డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మొదలుపెడితే ఓపెనింగ్స్ టైంకంతా హైప్ ని పెంచొచ్చు. సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, స్టార్ యాంకర్స్ తో ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అప్డేట్లు, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చెప్పుకుంటూ లిస్టు చాంతాడంతా ఉంది. ఇది అందరూ చేస్తున్నదే. ఆర్ఆర్ఆర్ అంతటి గ్రాండియర్ కే రాజమౌళి ఇద్దరు హీరోలను వెంటబెట్టుకుని ఆఖరికి తమిళనాడు కేరళలో చిన్నా చితకా హోస్ట్ లతో కూడా ప్రోగ్రాంస్ చేయించాడు.
అలాంటిది రామారావు ఇంత సైలెంట్ గా ఉంటే లాభం లేదు. అసలే వర్షాలతో జన జీవనం బాగా ప్రభావితం చెందింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ది వారియర్ సైతం ఈ కారణంగానే బుకింగ్స్ లో దూకుడు చూపించలేకపోతోంది. అలాంటిది ఈ నెల 29న వచ్చే మాస్ బొమ్మకు హంగామా ఓ రేంజ్ లో ఉండాలి. దివ్యంశ కౌశిక్, రజిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెవిన్యూ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ధమాకా, రావణాసురల థియేట్రికల్ బిజినెస్ కు రామారావు ఫలితం కీలకంగా మారనుంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…