ఇంకో రెండే వారాల్లో మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ విడుదల కానుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. దర్శకుడు శరత్ మండవ ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు కానీ హీరో ఇంకా రంగంలోకి దిగలేదు. ఖిలాడీ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి రవితేజ ఫ్యాన్స్ కు దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. టీజర్ ఓ మోస్తరుగా పర్లేదనిపించినప్పటికీ ఓవరాల్ గా సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడంలో తడబడింది. ఈ కారణంగానే బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు.
ఇదంతా మారాలంటే రామారావు అదే రవితేజ డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు మొదలుపెడితే ఓపెనింగ్స్ టైంకంతా హైప్ ని పెంచొచ్చు. సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, స్టార్ యాంకర్స్ తో ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అప్డేట్లు, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చెప్పుకుంటూ లిస్టు చాంతాడంతా ఉంది. ఇది అందరూ చేస్తున్నదే. ఆర్ఆర్ఆర్ అంతటి గ్రాండియర్ కే రాజమౌళి ఇద్దరు హీరోలను వెంటబెట్టుకుని ఆఖరికి తమిళనాడు కేరళలో చిన్నా చితకా హోస్ట్ లతో కూడా ప్రోగ్రాంస్ చేయించాడు.
అలాంటిది రామారావు ఇంత సైలెంట్ గా ఉంటే లాభం లేదు. అసలే వర్షాలతో జన జీవనం బాగా ప్రభావితం చెందింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ది వారియర్ సైతం ఈ కారణంగానే బుకింగ్స్ లో దూకుడు చూపించలేకపోతోంది. అలాంటిది ఈ నెల 29న వచ్చే మాస్ బొమ్మకు హంగామా ఓ రేంజ్ లో ఉండాలి. దివ్యంశ కౌశిక్, రజిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెవిన్యూ ఆఫీసర్ గా నటిస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ధమాకా, రావణాసురల థియేట్రికల్ బిజినెస్ కు రామారావు ఫలితం కీలకంగా మారనుంది.
This post was last modified on July 13, 2022 3:01 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…