భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ నిరీక్షణ ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు. హరిహరవీరమల్లుని పూర్తి చేయాల్సిన బాధ్యతతో పాటు వినోదయ సితం రీమేక్ ని వేగంగా ఫినిష్ చేసే టాస్క్ ని ఒప్పుకున్న పవర్ స్టార్ ఇవి రెండూ కాగానే జనసేన కార్యకలాపాల్లో బిజీ కాబోతున్నాడు. అక్టోబర్ నుంచి యాత్ర మొదలుపెట్టబోతున్నట్టు ఆల్రెడీ చెప్పేశారు. సో ఇప్పట్లో భగత్ సింగ్ కు మోక్షం దక్కే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఎప్పుడో కూడా చెప్పలేని స్థితి.
ఈ కారణంగానే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసేందుకు ప్రొసీడ్ అవ్వమని పవనే హరీష్ కు సూచించినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇంకా వెయిట్ చేసే కొద్దీ టైం వేస్ట్ అవుతోంది కాబట్టి మళ్ళీ ఓ ఏడాది తర్వాత దీని గురించి ఆలోచిద్దామని చెప్పినట్టు వినికిడి. ఇదంతా క్లారిటీ తీసుకున్నాకే మొన్న వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ రామ్ తో చేయబోయే మూవీ గురించి హింట్ ఇచ్చి ఆ రకంగా పొగిడాడని అంటున్నారు. ఈ గ్యాప్ లో హరీష్ ఏటిఎం అనే వెబ్ సిరీస్ తో పాటు మరో రెండు బడ్జెట్ సినిమాలకు కథలిచ్చాడు.
నిజానికి పవన్ అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంది భవదీయుడు భగత్ సింగ్ మీదే. స్ట్రెయిట్ సబ్జెక్టుతో పాటు గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి మరోసారి బాక్సాఫీస్ జాతర చూడొచ్చని ఆశపడ్డారు. దీని కోసమే ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్న మైత్రి నిర్మాతలు ఇప్పుడేం చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి. పవన్ టీమ్ నుంచి మాత్రం పొలిటికల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఏడాదికి భీమ్లా నాయక్ ఒకదానితోనే సర్దుకోక తప్పేలా లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వెండితెర దర్శనం 2023లోనే ఉంటుంది
This post was last modified on July 13, 2022 2:57 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…