కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ వరసబెట్టి రీమేకులు చేయడం అభిమానులకే రుచించడం లేదు. ఆల్రెడీ వేరే భాషల్లో ఆడేసినవి ఓటిటిలో జనం చూసేస్తుండగా మళ్ళీ వాటినే తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఎందుకనేది వాళ్ళ బాధ. అందులో లాజిక్ లేకపోలేదు. ఈ కారణంగానే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు వంద కోట్ల షేర్ ను అందుకోలేకపోయాయి. తెలుగు ఆడియన్స్ కోసం చేసిన మార్పులు సరిగా సింక్ అవ్వకపోవడం వీటి ఫలితాలను శాశించింది. అయితే ఈ ప్రవాహం ఇక్కడితో ఆగడం లేదు.
వినోదయ సితం రీమేక్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. సాయి తేజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు. పవన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న జనవాణి ప్రోగ్రాంకు బ్రేక్ ఇచ్చాక ఆయన కాల్ షీట్స్ తీసుకుని షెడ్యూల్ చేయబోతున్నారు. దర్శకత్వం వహించాల్సిన సముతిరఖని ఆర్టిస్టుగా యమా బిజీగా ఉండటంతో తను దొరకడం అన్నిటి కన్నా ముఖ్యం. హరిహర వీరమల్లు ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ దానికన్నా ముందే ఇదే ఫాస్ట్ గా పూర్తయినా ఆశ్చర్యం లేదు. మరి పవన్ వద్దనుకున్న రీమేక్ ముచ్చట వేరే ఉంది.
తమిళ హీరో విజయ్ నటించిన తేరి గుర్తుందిగా. దాన్ని తెలుగులో పోలీసోడుగా డబ్ చేస్తే ఆడలేదు. తర్వాత ఎప్పుడో ఓటిటికి శాటిలైట్ ఛానల్స్ కి ఇచ్చేశారు. మనవాళ్ళు చూసేశారు కూడా. ఆ తేరిని సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో చేయాలని ఒక దశలో అనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రతిపాదన పూర్తిగా డ్రాప్ అయ్యారట. 2024 ఎన్నికలు ఎంత దూరంలో లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇది చేయకపోవడమే ఫ్యాన్స్ కి పెద్ద శుభవార్త. లేకపోతే మరో కాటమరాయుడు వచ్చేదని భయపడ్డారు.
This post was last modified on July 12, 2022 10:12 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…