కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ వరసబెట్టి రీమేకులు చేయడం అభిమానులకే రుచించడం లేదు. ఆల్రెడీ వేరే భాషల్లో ఆడేసినవి ఓటిటిలో జనం చూసేస్తుండగా మళ్ళీ వాటినే తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం ఎందుకనేది వాళ్ళ బాధ. అందులో లాజిక్ లేకపోలేదు. ఈ కారణంగానే కంటెంట్ ఎంత బలంగా ఉన్నా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు వంద కోట్ల షేర్ ను అందుకోలేకపోయాయి. తెలుగు ఆడియన్స్ కోసం చేసిన మార్పులు సరిగా సింక్ అవ్వకపోవడం వీటి ఫలితాలను శాశించింది. అయితే ఈ ప్రవాహం ఇక్కడితో ఆగడం లేదు.
వినోదయ సితం రీమేక్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. సాయి తేజ్ డేట్స్ లాక్ చేసుకున్నారు. పవన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న జనవాణి ప్రోగ్రాంకు బ్రేక్ ఇచ్చాక ఆయన కాల్ షీట్స్ తీసుకుని షెడ్యూల్ చేయబోతున్నారు. దర్శకత్వం వహించాల్సిన సముతిరఖని ఆర్టిస్టుగా యమా బిజీగా ఉండటంతో తను దొరకడం అన్నిటి కన్నా ముఖ్యం. హరిహర వీరమల్లు ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ దానికన్నా ముందే ఇదే ఫాస్ట్ గా పూర్తయినా ఆశ్చర్యం లేదు. మరి పవన్ వద్దనుకున్న రీమేక్ ముచ్చట వేరే ఉంది.
తమిళ హీరో విజయ్ నటించిన తేరి గుర్తుందిగా. దాన్ని తెలుగులో పోలీసోడుగా డబ్ చేస్తే ఆడలేదు. తర్వాత ఎప్పుడో ఓటిటికి శాటిలైట్ ఛానల్స్ కి ఇచ్చేశారు. మనవాళ్ళు చూసేశారు కూడా. ఆ తేరిని సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో చేయాలని ఒక దశలో అనుకున్నారు. కానీ ఇప్పుడా ప్రతిపాదన పూర్తిగా డ్రాప్ అయ్యారట. 2024 ఎన్నికలు ఎంత దూరంలో లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇది చేయకపోవడమే ఫ్యాన్స్ కి పెద్ద శుభవార్త. లేకపోతే మరో కాటమరాయుడు వచ్చేదని భయపడ్డారు.
This post was last modified on July 12, 2022 10:12 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…