ఈ మధ్య రిలీజైన ‘విక్రమ్’ మినహా ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మేజిక్ నంబర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. నిజానికి కోలీవుడ్ లోనే కాదు కమల్ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాదాపు ఆరు కోట్లకు కొన్న ‘విక్రమ్’ తెలుగు వర్షన్ పదిహేను కోట్లుకు పైగా కొల్లగొట్టింది. దర్శకుడు లోకేష్ కనగారాజ్ చూపించిన మాస్ కంటెంట్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మళ్ళీ మళ్ళీ చూస్తూ భారీ కలెక్షన్స్ అందించారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఏ చిత్రం పెద్దగా ఆడలేదు. అన్నీ రెండు మూడు రోజులకే థియేటర్స్ నుండి సర్దుకున్నాయి.
ఇలాంటి టైంలో ఇప్పుడు కమల్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకునే హీరో ఎవరా ? అనే ఆసక్తి నెలకొంది. ఈ నెలలో మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో రామ్ ‘ది వారియర్’ , నాగ చైతన్య ‘థాంక్యూ’, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఉన్నాయి. ఈ మూడిటిపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. వీటిలో ‘ది వారియర్’ , ‘రామారావు ఆన్ డ్యూటీ’ కమర్షియల్ బిగ్ నంబర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మాస్ కంటెంట్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం. ఇక ‘థాంక్యూ’ ని కూడా తీసి పారేయలేం. సినిమా బాగుంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చే చాన్స్ ఉండనే ఉంది.
ఈ మూడిటిలో మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా ఏంటో ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కమల్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టే సినిమా ఈ మూడిటిలో ఉందో లేదా మరో స్టార్ హీరో సినిమా రావలసిందేనా ? వేచి చూడాలి.
This post was last modified on July 11, 2022 10:25 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…