Movie News

కమల్ తర్వాత ఎవరు ?

ఈ మధ్య రిలీజైన ‘విక్రమ్’ మినహా ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మేజిక్ నంబర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. నిజానికి కోలీవుడ్ లోనే కాదు కమల్ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాదాపు ఆరు కోట్లకు కొన్న ‘విక్రమ్’ తెలుగు వర్షన్ పదిహేను కోట్లుకు పైగా కొల్లగొట్టింది. దర్శకుడు లోకేష్ కనగారాజ్ చూపించిన మాస్ కంటెంట్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మళ్ళీ మళ్ళీ చూస్తూ భారీ కలెక్షన్స్ అందించారు. ఆ సినిమా తర్వాత వచ్చిన ఏ చిత్రం పెద్దగా ఆడలేదు. అన్నీ రెండు మూడు రోజులకే థియేటర్స్ నుండి సర్దుకున్నాయి.

ఇలాంటి టైంలో ఇప్పుడు కమల్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకునే హీరో ఎవరా ? అనే ఆసక్తి నెలకొంది. ఈ నెలలో మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో రామ్ ‘ది వారియర్’ , నాగ చైతన్య ‘థాంక్యూ’, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఉన్నాయి. ఈ మూడిటిపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. వీటిలో ‘ది వారియర్’ , ‘రామారావు ఆన్ డ్యూటీ’ కమర్షియల్ బిగ్ నంబర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మాస్ కంటెంట్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు కాబట్టి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం. ఇక ‘థాంక్యూ’ ని కూడా తీసి పారేయలేం. సినిమా బాగుంటే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చే చాన్స్ ఉండనే ఉంది.

ఈ మూడిటిలో మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు దక్కించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా ఏంటో ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కమల్ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టే సినిమా ఈ మూడిటిలో ఉందో లేదా మరో స్టార్ హీరో సినిమా రావలసిందేనా ? వేచి చూడాలి.

This post was last modified on July 11, 2022 10:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

34 minutes ago

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే

దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…

2 hours ago

కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు…

3 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…

3 hours ago

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…

3 hours ago

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

3 hours ago