పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో పెద్ద హిట్లుగా నిలిచి, క్లాసిక్ స్టేటస్ అందుకున్న సినిమాల టైటిళ్లను ఇప్పుడు యువ కథానాయకులు ఒక్కొక్కరుగా వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘తొలిప్రేమ’ టైటిల్ను మెగా ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్ తన సినిమాకు వాడుకున్నాడు. ఆ టైటిల్ విషయంలో ముందు విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. సినిమా అయితే మంచి ఫలితాన్నే అందుకుంది.
ఈ మధ్యే విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో మరింత వ్యతిరేకత కనిపించింది. అందుకు విజయ్ మెగా ఫ్యామిలీకి చెందిన వాడు కాకపోవడం, అలాగే ‘ఖుషి’ టైటిల్తో అభిమానులకు ఎమోషనల్ కనెక్షన్ ఉండడం కూడా కారణమే. అయినప్పటికీ విజయ్ అండ్ కో వెనక్కి తగ్గలేదు. ఇప్పుడిక మరో పవన్ టైటిల్తో కొత్త సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి పవన్ టైటిల్ వాడబోయేది అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ అక్కినేని అట.
గత ఏడాది ‘మోస్ట్ ఎలిజిబుల్’ బ్యాచిలర్తో తొలి విజయాన్నందుకుని.. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే భారీ చిత్రం చేస్తున్నాడు అఖిల్. త్వరలోనే ఈ సినిమా టీజర్ లాంచ్ కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. అఖిల్ తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో అతను నటించబోతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారట.
ఐతే పవన్ ‘తమ్ముడు’ సినిమాలో మాదిరి అన్నదమ్ముల కథ కాదు ఇది. అక్కా తమ్ముళ్ల బంధం నేపథ్యంలో సెంటిమెంట్, యాక్షన్ టచ్ ఉన్న కథతో వేణు సినిమా చేయబోతున్నాడని.. తమ్ముడిగా అఖిల్ నటించబోతున్నాడని అంటున్నారు. ఈ టైటిల్ను ఖాయం చేసినట్లే అని.. సినిమా అనౌన్స్మెంట్ కూడా ఈ టైటిల్తోనే జరగబోతోందని అంటున్నారు. మరి ఈ టైటిల్ విషయంలో పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…