ఊహించిన దానికన్నా చాలా పెద్ద విజయం అందుకుని బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ క్రాక్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తో సంక్రాంతి రేస్ ని గెలిచిన దర్శకుడు గోపిచంద్ మలినేని అంటే ఇక చెప్పేదేముంది.
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇవన్నీ మాస్ మసాలా అనే గ్యారెంటీ ఇవ్వడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు డిస్ట్రిబ్యూటర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు ట్రేడ్ నుంచి అందిన సమాచారం.
విడుదలకు సంబంధించి డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దాని ప్రకారం అఖండ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ డిసెంబర్ 2 ని థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. అఫీషియల్ గా టైటిల్ తో ప్రకటించాలని డిసైడ్ కావడంతో అప్పటిదాకా అధికారికంగా చెప్పకపోవచ్చు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీకి మరోసారి తమన్ సంగీతం బ్యాక్ బోన్ గా నిలవనుంది. ఇప్పటికైతే ఆ తేదీకి ఎవరూ వస్తామని చెప్పలేదు. బాలయ్య కనక ఫిక్స్ అయితే ఇతర హీరోలు వేరే ఆప్షన్ ఎంచుకుంటారు.
ముందు దసరా సీజన్ ని టార్గెట్ చేసుకున్నప్పటికీ బాలయ్యకు కరోనా వచ్చి కొంత బ్రేక్ పడటం, అమెరికా వీసా పనుల్లో జాప్యం జరగడం లాంటి కారణాల వల్ల ఫ్రెష్ షెడ్యూల్ ని టర్కీకి షిఫ్ట్ చేసుకున్నారు. ఆక్టోబర్ లోపు పూర్తి చేసి ఓ రెండు నెలలు పూర్తిగా ప్రమోషన్ చేస్తారు. మైత్రికి బాలయ్యతో మొదటిసారి కాంబినేషన్ కాబట్టి దానికి తగ్గట్టే బడ్జెట్ విషయంలో రాజీ సూత్రం పాటించడం లేదు. క్రాక్ తర్వాత వచ్చే మూవీ కావడంతో అటు గోపీచంద్ మలినేని కూడా గట్టి హోమ్ వర్కే చేస్తున్నాడు.
This post was last modified on July 11, 2022 12:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…