ఊహించిన దానికన్నా చాలా పెద్ద విజయం అందుకుని బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ క్రాక్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తో సంక్రాంతి రేస్ ని గెలిచిన దర్శకుడు గోపిచంద్ మలినేని అంటే ఇక చెప్పేదేముంది.
ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇవన్నీ మాస్ మసాలా అనే గ్యారెంటీ ఇవ్వడంతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు డిస్ట్రిబ్యూటర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్టు ట్రేడ్ నుంచి అందిన సమాచారం.
విడుదలకు సంబంధించి డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. దాని ప్రకారం అఖండ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ డిసెంబర్ 2 ని థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. అఫీషియల్ గా టైటిల్ తో ప్రకటించాలని డిసైడ్ కావడంతో అప్పటిదాకా అధికారికంగా చెప్పకపోవచ్చు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీకి మరోసారి తమన్ సంగీతం బ్యాక్ బోన్ గా నిలవనుంది. ఇప్పటికైతే ఆ తేదీకి ఎవరూ వస్తామని చెప్పలేదు. బాలయ్య కనక ఫిక్స్ అయితే ఇతర హీరోలు వేరే ఆప్షన్ ఎంచుకుంటారు.
ముందు దసరా సీజన్ ని టార్గెట్ చేసుకున్నప్పటికీ బాలయ్యకు కరోనా వచ్చి కొంత బ్రేక్ పడటం, అమెరికా వీసా పనుల్లో జాప్యం జరగడం లాంటి కారణాల వల్ల ఫ్రెష్ షెడ్యూల్ ని టర్కీకి షిఫ్ట్ చేసుకున్నారు. ఆక్టోబర్ లోపు పూర్తి చేసి ఓ రెండు నెలలు పూర్తిగా ప్రమోషన్ చేస్తారు. మైత్రికి బాలయ్యతో మొదటిసారి కాంబినేషన్ కాబట్టి దానికి తగ్గట్టే బడ్జెట్ విషయంలో రాజీ సూత్రం పాటించడం లేదు. క్రాక్ తర్వాత వచ్చే మూవీ కావడంతో అటు గోపీచంద్ మలినేని కూడా గట్టి హోమ్ వర్కే చేస్తున్నాడు.
This post was last modified on July 11, 2022 12:56 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…