పైరసీని అంతం చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి వివిధ సినీ పరిశ్రమలు. కానీ అది రూపం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప.. తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఇంతకుముందు పైరసీ ప్రింట్లు అంటే క్లారిటీ లేకుండా, నాసిరకంగా ఉండేవి. కానీ ఇప్పుడు రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్లు బయటికి వస్తున్నాయి. పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి తమ యూజర్లతో కనెక్ట్ అయి ఏదో రకంగా వారికి పైరసీ వెర్షన్లను చేరవేస్తున్నాయి.
వెబ్ సైట్ల ద్వారా నేరుగా కొత్త సినిమాలు చూసేవాళ్లు కొందరైతే.. డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్లు ఇంకొందరు. ఇలా ఓ నెటిజన్ తన సినిమా ‘రాకెట్రీ’ని చూసినట్లు నటుడు, దర్శకుడు మాధవన్ కనిపెట్టేయడం ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది. తమ సినిమాలు రిలీజైనపుడు నెటిజన్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్కు సెలబ్రెటీలు స్పందించడం మామూలే.
తనే ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ’కి సంబంధించి పాజిటివ్ ట్వీట్ల మీద కూడా మాధవన్ స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నాడు. రీట్వీట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందన మాధవన్ దృష్టిని ఆకర్షించింది. రాకెట్రీ సినిమా చూశానని.. మాధవన్ నట ప్రతిభ గురించి ఎప్పుడూ సందేహాలు లేవని, కానీ దర్శకుడిగా అరంగేట్రంలోనే అదరగొట్టేశాడని.. పతాక సన్నివేశాన్ని తాను మళ్లీ మళ్లీ చూశానని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.
ఐతే మాధవన్ దీనికి స్పందిస్తూ.. “ఆ సన్నివేశాన్ని నువ్వు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగావు” అని ప్రశ్నించాడు. దీన్ని బట్టే ఆ నెటిజన్ చూసింది పైరసీ వెర్షన్ అని అర్థమైపోయింది అందరికీ. థియేటర్లలో అయితే ఒకే రోజు మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడటం సాధ్యం కాదు. ఇంట్లో పైరసీ వెర్షన్ చూస్తున్నాడు కాబట్టే మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడగలిగాడన్నది స్పష్టం. మాధవన్ ఈ విషయాన్ని కనిపెట్టి ట్వీట్ చేయడంతో సదరు నెటిజన్.. ట్వీట్ డెలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇక ‘రాకెట్రీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్గా అది అనుకున్నంత విజయం సాధించట్లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్.
This post was last modified on July 10, 2022 3:21 pm
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…