పైరసీని అంతం చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి వివిధ సినీ పరిశ్రమలు. కానీ అది రూపం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప.. తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఇంతకుముందు పైరసీ ప్రింట్లు అంటే క్లారిటీ లేకుండా, నాసిరకంగా ఉండేవి. కానీ ఇప్పుడు రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్లు బయటికి వస్తున్నాయి. పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి తమ యూజర్లతో కనెక్ట్ అయి ఏదో రకంగా వారికి పైరసీ వెర్షన్లను చేరవేస్తున్నాయి.
వెబ్ సైట్ల ద్వారా నేరుగా కొత్త సినిమాలు చూసేవాళ్లు కొందరైతే.. డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్లు ఇంకొందరు. ఇలా ఓ నెటిజన్ తన సినిమా ‘రాకెట్రీ’ని చూసినట్లు నటుడు, దర్శకుడు మాధవన్ కనిపెట్టేయడం ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది. తమ సినిమాలు రిలీజైనపుడు నెటిజన్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్కు సెలబ్రెటీలు స్పందించడం మామూలే.
తనే ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ’కి సంబంధించి పాజిటివ్ ట్వీట్ల మీద కూడా మాధవన్ స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నాడు. రీట్వీట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందన మాధవన్ దృష్టిని ఆకర్షించింది. రాకెట్రీ సినిమా చూశానని.. మాధవన్ నట ప్రతిభ గురించి ఎప్పుడూ సందేహాలు లేవని, కానీ దర్శకుడిగా అరంగేట్రంలోనే అదరగొట్టేశాడని.. పతాక సన్నివేశాన్ని తాను మళ్లీ మళ్లీ చూశానని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.
ఐతే మాధవన్ దీనికి స్పందిస్తూ.. “ఆ సన్నివేశాన్ని నువ్వు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగావు” అని ప్రశ్నించాడు. దీన్ని బట్టే ఆ నెటిజన్ చూసింది పైరసీ వెర్షన్ అని అర్థమైపోయింది అందరికీ. థియేటర్లలో అయితే ఒకే రోజు మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడటం సాధ్యం కాదు. ఇంట్లో పైరసీ వెర్షన్ చూస్తున్నాడు కాబట్టే మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడగలిగాడన్నది స్పష్టం. మాధవన్ ఈ విషయాన్ని కనిపెట్టి ట్వీట్ చేయడంతో సదరు నెటిజన్.. ట్వీట్ డెలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇక ‘రాకెట్రీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్గా అది అనుకున్నంత విజయం సాధించట్లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్.
This post was last modified on July 10, 2022 3:21 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…