పైరసీని అంతం చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నాయి వివిధ సినీ పరిశ్రమలు. కానీ అది రూపం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప.. తగ్గే సూచనలే కనిపించడం లేదు. ఇంతకుముందు పైరసీ ప్రింట్లు అంటే క్లారిటీ లేకుండా, నాసిరకంగా ఉండేవి. కానీ ఇప్పుడు రిలీజ్ రోజే హెచ్డీ ప్రింట్లు బయటికి వస్తున్నాయి. పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి తమ యూజర్లతో కనెక్ట్ అయి ఏదో రకంగా వారికి పైరసీ వెర్షన్లను చేరవేస్తున్నాయి.
వెబ్ సైట్ల ద్వారా నేరుగా కొత్త సినిమాలు చూసేవాళ్లు కొందరైతే.. డౌన్లోడ్ చేసుకుని చూసేవాళ్లు ఇంకొందరు. ఇలా ఓ నెటిజన్ తన సినిమా ‘రాకెట్రీ’ని చూసినట్లు నటుడు, దర్శకుడు మాధవన్ కనిపెట్టేయడం ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారింది. తమ సినిమాలు రిలీజైనపుడు నెటిజన్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్కు సెలబ్రెటీలు స్పందించడం మామూలే.
తనే ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ’కి సంబంధించి పాజిటివ్ ట్వీట్ల మీద కూడా మాధవన్ స్పందిస్తూ.. కామెంట్లు చేస్తున్నాడు. రీట్వీట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ స్పందన మాధవన్ దృష్టిని ఆకర్షించింది. రాకెట్రీ సినిమా చూశానని.. మాధవన్ నట ప్రతిభ గురించి ఎప్పుడూ సందేహాలు లేవని, కానీ దర్శకుడిగా అరంగేట్రంలోనే అదరగొట్టేశాడని.. పతాక సన్నివేశాన్ని తాను మళ్లీ మళ్లీ చూశానని ఆ నెటిజన్ పేర్కొన్నాడు.
ఐతే మాధవన్ దీనికి స్పందిస్తూ.. “ఆ సన్నివేశాన్ని నువ్వు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగావు” అని ప్రశ్నించాడు. దీన్ని బట్టే ఆ నెటిజన్ చూసింది పైరసీ వెర్షన్ అని అర్థమైపోయింది అందరికీ. థియేటర్లలో అయితే ఒకే రోజు మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడటం సాధ్యం కాదు. ఇంట్లో పైరసీ వెర్షన్ చూస్తున్నాడు కాబట్టే మళ్లీ మళ్లీ ఆ సన్నివేశాన్ని చూడగలిగాడన్నది స్పష్టం. మాధవన్ ఈ విషయాన్ని కనిపెట్టి ట్వీట్ చేయడంతో సదరు నెటిజన్.. ట్వీట్ డెలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఇక ‘రాకెట్రీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ, కమర్షియల్గా అది అనుకున్నంత విజయం సాధించట్లేదన్నది ట్రేడ్ వర్గాల టాక్.
This post was last modified on July 10, 2022 3:21 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…