నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలో వస్తున్న ‘థ్యాంక్యూ’ కి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీం. తాజాగా చైతూ , రాశి రంగంలోకి దిగి సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ మధ్య కాలేజిలో ఫేర్ వెల్ సాంగ్ లాంచ్ చేశారు. ముందుగా టీజర్ తో సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. అయితే టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచడంలో విఫలమైంది. ముఖ్యంగా ప్రేమమ్, మహర్షి లతో పోలుస్తూ టీజర్ ని ట్రోల్ చేశారు. నిజానికి సినిమా థీమ్ అంతా అలానే ఉంది.
అక్కడక్కడా మజిలీ ఛాయలు కూడా టీజర్ లో కనిపించాయి. అందుకే ఇప్పుడు మేకర్స్ ట్రైలర్ విషయంలో జాగ్రత్త పడుతూ కేర్ తీసుకుంటున్నారు. అలాంటి కంపెరిజన్స్ లేకుండా క్లియర్ గా బెస్ట్ విజువల్స్ తో ఓ ట్రైలర్ వదలాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓ కట్ రెడీ అయింది. మరో రెండ్రోజుల్లో అంటే జులై 9న కానీ 10 న ట్రైలర్ ని ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. దిల్ రాజు కూడా ట్రైలర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
ఏదేమైనా ఈ సినిమాతో చైతుకి ఎట్టిపరిస్థితుల్లో హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడు దిల్ రాజు. తన బేనర్ లోనే హీరోగా చైతుని పరిచయం చేసి జోష్ తో హిట్ ఇవ్వలేకపోయిన దిల్ రాజు ఈసారి నాగార్జున తనని నమ్మి అప్పుడు చైతు మొదటి సినిమా ఇచ్చినందుకు థాంక్యూ చెప్పి హిట్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on July 7, 2022 5:11 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…