తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతమున్న హీరోల్లో భాషపై పట్టు, వాచకం, ఉచ్ఛారణ విషయంలో అత్యధిక మార్కులు పడేది జూనియర్ ఎన్టీఆర్కే అంటే అతిశయోక్తి కాదు. తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వాచకం, ఉచ్ఛారణ విషయంలో మంచి పట్టుతో సినిమాల్లోకి అడుగుపెట్టాడతను. మొదట్లో అతడి వాయిస్ కొంచెం తేడాగా ఉండేది కానీ.. వయసు పెరిగాక స్పష్టత వచ్చింది. డైలాగ్ డెలివరీలో తనకు తిరుగులేని తారక్ చాటుకున్నాడు. గత దశాబ్ద కాలంలో సినిమా సినిమాకూ తారక్ డైలాగ్ డెలివరీ మెరుగవుతూ వచ్చింది. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో, తగ్గించడంలో.. సన్నివేశం తాలూకు ఎమోషన్ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తారక్కు తారక్కు సాటే అని చాలాసార్లు రుజువైంది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన టీజర్లో తారక్ తనదైన వాయిస్ ఓవర్తో ఔరా అనిపించాడు. అసలే రోమాలు నిక్కబొడుచుకునే డైలాగ్.. దాన్ని తారక్ ఇంకా ఎలివేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన వైనం అమోఘం. అయితే తెలుగు టీజర్లో డైలాగ్ చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ తారక్ ఇదే రేంజిలో డైలాగ్ పేల్చిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హిందీలో తారక్ తన వాయిస్లో బేస్ను ఇంకా పెంచి.. పదాల్ని స్పష్టంగా పలుకుతూ ఇచ్చిన వాయిస్ ఓవర్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది.
ఉత్తరాది జనాలు తారక్ టాలెంటుకి ఫిదా అయిపోతున్నారు. ఒక్క మలయాళంలో మాత్రమే తారక్ టీజర్కు వాయిస్ ఇవ్వలేదు. వాళ్ల యాసను అందుకోవడం చాలా కష్టం. దాని మాడ్యులేషన్లో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క భాషకు తారక్ దూరంగా ఉన్నాడు. టీజర్లో తారక్ వాయిస్ విన్నాక అతను మిగతా భాషల్లోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…