తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ స్థాయిలో ప్రయోగాలు చేసి, ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన రాబట్టుకున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. 90వ దశకంలో ఆయన సినిమాలు మామూలు ప్రకంపనలు రేపలేదు. గులాబి, నిన్నే పెళ్ళాడతా, సింధూరం, మురారి, ఖడ్గం సినిమాలు బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా చర్చనీయాంశం అయ్యాయి. అప్పటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఐతే గత పది పదిహేనేళ్లలో మాత్రం కృష్ణవంశీ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. అయినా కృష్ణవంశీ ఆగిపోలేదు. ఇప్పుడాయన్నుంచి ‘రంగమార్తాండ’ సినిమా రాబోతోంది.
మరాఠీలో విజయవంతమైన ‘నట సామ్రాట్’కు ఇది రీమేక్. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా అని కృష్ణవంశీని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ‘హిట్ సినిమా’కు ఆయనిచ్చిన నిర్వచనం ఆసక్తి రేకెత్తించేదే. ఇంతకీ ఆయనేమన్నాడంటే..
‘‘నేను ఇలా చెబితే జనాలకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. నేను హిట్ కోసం ఎప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ‘రంగమార్తాండ’నే ఎందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి… అంతే’’ అంటూ తన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలో సూత్రీకరించాడు కృష్ణవంశీ. ఆయనిచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో పోస్టులుగా పెట్టి దటీజ్ కృష్ణవంశీ అని కొనియాడుతున్నారు అభిమానులు.
This post was last modified on July 5, 2022 3:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…