తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ స్థాయిలో ప్రయోగాలు చేసి, ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన రాబట్టుకున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. 90వ దశకంలో ఆయన సినిమాలు మామూలు ప్రకంపనలు రేపలేదు. గులాబి, నిన్నే పెళ్ళాడతా, సింధూరం, మురారి, ఖడ్గం సినిమాలు బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా చర్చనీయాంశం అయ్యాయి. అప్పటి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఐతే గత పది పదిహేనేళ్లలో మాత్రం కృష్ణవంశీ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. అయినా కృష్ణవంశీ ఆగిపోలేదు. ఇప్పుడాయన్నుంచి ‘రంగమార్తాండ’ సినిమా రాబోతోంది.
మరాఠీలో విజయవంతమైన ‘నట సామ్రాట్’కు ఇది రీమేక్. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారా అని కృష్ణవంశీని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. ఈ సందర్భంగా ‘హిట్ సినిమా’కు ఆయనిచ్చిన నిర్వచనం ఆసక్తి రేకెత్తించేదే. ఇంతకీ ఆయనేమన్నాడంటే..
‘‘నేను ఇలా చెబితే జనాలకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. నేను హిట్ కోసం ఎప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ‘రంగమార్తాండ’నే ఎందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి… అంతే’’ అంటూ తన గురువు రామ్ గోపాల్ వర్మ తరహాలో సూత్రీకరించాడు కృష్ణవంశీ. ఆయనిచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో పోస్టులుగా పెట్టి దటీజ్ కృష్ణవంశీ అని కొనియాడుతున్నారు అభిమానులు.
This post was last modified on July 5, 2022 3:12 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…