నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేస్తుంటాడు. సురేందర్ రెడ్డి , అనీల్ రావిపూడి , గుహన్ వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ దే. ఇప్పుడు తన బేనర్ ద్వారా మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే పీరియాడిక్ ఫాంటసీ సినిమా రాబోతుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో వసిష్ట్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అయితే ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఇటివలే ఎన్టీఆర్ కోసం వసిష్ట్ కళ్యాణ్ రామ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో త్వరలోనే తారక్ తో ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తాజాగా బింబిసార ఈవెంట్ లో స్వయంగా చెప్పుకున్నాడు. ‘బింబిసార’ ని నాలుగు భాగాలుగా తీసి ఓ ఫ్రాంచైజీ లా చేస్తానని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ అంటుంది అన్నాడు. దాంతో రెండో భాగంలో ఎన్టీఆర్ ఏమైనా నటించే అవకాశం ఉందా ? అనే ప్రశ్న మీడియా నుండి కళ్యాణ్ రామ్ కి ఎదురైంది.
దానికి బదులు చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు నందమూరి హీరో. నాలుగు రోజుల క్రితమే వసిష్ట్ , నేను తారక్ కోసం ఓ కథ అనుకున్నామని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వొచ్చని తెలిపాడు. దీంతో కుర్ర డైరెక్టర్ రెండో సినిమాకి ఎన్టీఆర్ ని అప్పజెప్పే ప్లానింగ్ లో కళ్యాణ్ రామ్ ఉన్నట్లు స్పష్టమైంది. ‘బింబిసార’ భారీ హిట్టయితే తారక్ తో వసిష్ట్ సినిమా ఈజీగా పట్టలెక్కేస్తుంది. అన్ని కుదిరితే కొరటాల , ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ ,వసిష్ట్ సినిమా ఉండొచ్చు.
This post was last modified on July 4, 2022 9:08 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…