Movie News

ఎన్టీఆర్ సినిమాపై కళ్యాణ్ రామ్ అప్ డేట్ !

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేస్తుంటాడు. సురేందర్ రెడ్డి , అనీల్ రావిపూడి , గుహన్ వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ దే. ఇప్పుడు తన బేనర్ ద్వారా మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే పీరియాడిక్ ఫాంటసీ సినిమా రాబోతుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో వసిష్ట్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అయితే ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఇటివలే ఎన్టీఆర్ కోసం వసిష్ట్ కళ్యాణ్ రామ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో త్వరలోనే తారక్ తో ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తాజాగా బింబిసార ఈవెంట్ లో స్వయంగా చెప్పుకున్నాడు. ‘బింబిసార’ ని నాలుగు భాగాలుగా తీసి ఓ ఫ్రాంచైజీ లా చేస్తానని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ అంటుంది అన్నాడు. దాంతో రెండో భాగంలో ఎన్టీఆర్ ఏమైనా నటించే అవకాశం ఉందా ? అనే ప్రశ్న మీడియా నుండి కళ్యాణ్ రామ్ కి ఎదురైంది.

దానికి బదులు చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు నందమూరి హీరో. నాలుగు రోజుల క్రితమే వసిష్ట్ , నేను తారక్ కోసం ఓ కథ అనుకున్నామని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వొచ్చని తెలిపాడు. దీంతో కుర్ర డైరెక్టర్ రెండో సినిమాకి ఎన్టీఆర్ ని అప్పజెప్పే ప్లానింగ్ లో కళ్యాణ్ రామ్ ఉన్నట్లు స్పష్టమైంది. ‘బింబిసార’ భారీ హిట్టయితే తారక్ తో వసిష్ట్ సినిమా ఈజీగా పట్టలెక్కేస్తుంది. అన్ని కుదిరితే కొరటాల , ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ ,వసిష్ట్ సినిమా ఉండొచ్చు.

Satya

Recent Posts

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

38 minutes ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

41 minutes ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

56 minutes ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

2 hours ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

2 hours ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

2 hours ago