నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో సినిమాలు చేస్తుంటాడు. సురేందర్ రెడ్డి , అనీల్ రావిపూడి , గుహన్ వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత కళ్యాణ్ రామ్ దే. ఇప్పుడు తన బేనర్ ద్వారా మరో దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే పీరియాడిక్ ఫాంటసీ సినిమా రాబోతుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో వసిష్ట్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
అయితే ఈ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట కళ్యాణ్ రామ్. ఇటివలే ఎన్టీఆర్ కోసం వసిష్ట్ కళ్యాణ్ రామ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో త్వరలోనే తారక్ తో ఆ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ విషయాన్ని తాజాగా బింబిసార ఈవెంట్ లో స్వయంగా చెప్పుకున్నాడు. ‘బింబిసార’ ని నాలుగు భాగాలుగా తీసి ఓ ఫ్రాంచైజీ లా చేస్తానని కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. వచ్చే ఏడాది రెండో పార్ట్ రిలీజ్ అంటుంది అన్నాడు. దాంతో రెండో భాగంలో ఎన్టీఆర్ ఏమైనా నటించే అవకాశం ఉందా ? అనే ప్రశ్న మీడియా నుండి కళ్యాణ్ రామ్ కి ఎదురైంది.
దానికి బదులు చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు నందమూరి హీరో. నాలుగు రోజుల క్రితమే వసిష్ట్ , నేను తారక్ కోసం ఓ కథ అనుకున్నామని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వొచ్చని తెలిపాడు. దీంతో కుర్ర డైరెక్టర్ రెండో సినిమాకి ఎన్టీఆర్ ని అప్పజెప్పే ప్లానింగ్ లో కళ్యాణ్ రామ్ ఉన్నట్లు స్పష్టమైంది. ‘బింబిసార’ భారీ హిట్టయితే తారక్ తో వసిష్ట్ సినిమా ఈజీగా పట్టలెక్కేస్తుంది. అన్ని కుదిరితే కొరటాల , ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ ,వసిష్ట్ సినిమా ఉండొచ్చు.
This post was last modified on July 4, 2022 9:08 pm
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…