ప్రస్తుతం సౌత్ ఇండియాలో సాయిపల్లవికి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ మరే కథానాయికతోనూ మ్యాచ్ చేయలేనిది. ఇక్కడ స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారికి అభిమాన గణం కూడా పెద్దదే. కానీ కేవలం ఒక హీరోయిన్ నటన చూడడానికి థియేటర్లకు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం సాయిపల్లవి విషయంలోనే జరుగుతోంది. అలాంటి గుర్తింపు అందరికీ దక్కదు. నటన పరంగా ఆమె తన అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నప్పటికీ.. వరుసబెట్టి ఏడుపుగొట్టు పాత్రలు చేస్తోందనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి.
తెలుగులో ఆమెకు ఎంతో పేరు తెచ్చిన ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. కొంత వరకు ఎమోషన్లు కూడా ఉన్నా.. అందులో ఆ పాత్ర బాగా నచ్చడానికి కారణం ఎంటర్టైన్మెంట్ యాంగిలే. సాయిపల్లవి నుంచి అలాంటి టిపికల్, అగ్రెసివ్ క్యారెక్టర్లే ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇటీవలే విడుదలైన విరాటపర్వంలో వెన్నెల పాత్ర చూసి సాయిపల్లవి అభిమానులకు గుండె పగిలిందనే చెప్పాలి. ఆ పాత్రను అంత శోకంతో చూపించి, విషాదభరితంగా ముగించడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు ప్రస్తుత ట్రెండులో ఆ టైపు సీరియస్ సినిమాలు, క్యారెక్టర్లు అసలు వర్కవుట్ కావట్లేదు. దీని కంటే ముందు సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీలో సైతం ఆమెది బాధతో నలిగిపోయే, ప్రేక్షకులనూ బాధ పెట్టే పాత్రే. ఈ తరహా ఏడుపుగొట్టు పాత్రలు ఇక వద్దని, జాలీగా ఉండే అల్లరి పాత్రలు చేయాలని సాయిపల్లవికి సోషల్ మీడియా ద్వారా అభిమానులు విజ్ఞప్తులు పెడుతున్నారు.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న గార్గి పోస్టర్లు చూసినా.. అది సీరియస్ సినిమాలాగే కనిపిస్తోంది. మళ్లీ ఏదో సమస్యతో ముడిపడ్డ సినిమాలోనే సాయిపల్లవి నటిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి పాత్రలు ఇక చాలించి సరదా పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 4, 2022 9:25 am
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…