ప్రస్తుతం సౌత్ ఇండియాలో సాయిపల్లవికి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ మరే కథానాయికతోనూ మ్యాచ్ చేయలేనిది. ఇక్కడ స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారికి అభిమాన గణం కూడా పెద్దదే. కానీ కేవలం ఒక హీరోయిన్ నటన చూడడానికి థియేటర్లకు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం సాయిపల్లవి విషయంలోనే జరుగుతోంది. అలాంటి గుర్తింపు అందరికీ దక్కదు. నటన పరంగా ఆమె తన అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నప్పటికీ.. వరుసబెట్టి ఏడుపుగొట్టు పాత్రలు చేస్తోందనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి.
తెలుగులో ఆమెకు ఎంతో పేరు తెచ్చిన ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. కొంత వరకు ఎమోషన్లు కూడా ఉన్నా.. అందులో ఆ పాత్ర బాగా నచ్చడానికి కారణం ఎంటర్టైన్మెంట్ యాంగిలే. సాయిపల్లవి నుంచి అలాంటి టిపికల్, అగ్రెసివ్ క్యారెక్టర్లే ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇటీవలే విడుదలైన విరాటపర్వంలో వెన్నెల పాత్ర చూసి సాయిపల్లవి అభిమానులకు గుండె పగిలిందనే చెప్పాలి. ఆ పాత్రను అంత శోకంతో చూపించి, విషాదభరితంగా ముగించడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు ప్రస్తుత ట్రెండులో ఆ టైపు సీరియస్ సినిమాలు, క్యారెక్టర్లు అసలు వర్కవుట్ కావట్లేదు. దీని కంటే ముందు సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీలో సైతం ఆమెది బాధతో నలిగిపోయే, ప్రేక్షకులనూ బాధ పెట్టే పాత్రే. ఈ తరహా ఏడుపుగొట్టు పాత్రలు ఇక వద్దని, జాలీగా ఉండే అల్లరి పాత్రలు చేయాలని సాయిపల్లవికి సోషల్ మీడియా ద్వారా అభిమానులు విజ్ఞప్తులు పెడుతున్నారు.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న గార్గి పోస్టర్లు చూసినా.. అది సీరియస్ సినిమాలాగే కనిపిస్తోంది. మళ్లీ ఏదో సమస్యతో ముడిపడ్డ సినిమాలోనే సాయిపల్లవి నటిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి పాత్రలు ఇక చాలించి సరదా పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 4, 2022 9:25 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…