ప్రస్తుతం సౌత్ ఇండియాలో సాయిపల్లవికి ఉన్న ఇమేజ్, ఫాలోయింగ్ మరే కథానాయికతోనూ మ్యాచ్ చేయలేనిది. ఇక్కడ స్టార్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారికి అభిమాన గణం కూడా పెద్దదే. కానీ కేవలం ఒక హీరోయిన్ నటన చూడడానికి థియేటర్లకు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం సాయిపల్లవి విషయంలోనే జరుగుతోంది. అలాంటి గుర్తింపు అందరికీ దక్కదు. నటన పరంగా ఆమె తన అభిమానులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నప్పటికీ.. వరుసబెట్టి ఏడుపుగొట్టు పాత్రలు చేస్తోందనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి.
తెలుగులో ఆమెకు ఎంతో పేరు తెచ్చిన ఫిదా సినిమాలోని భానుమతి పాత్ర చాలా సరదాగా ఉంటుంది. కొంత వరకు ఎమోషన్లు కూడా ఉన్నా.. అందులో ఆ పాత్ర బాగా నచ్చడానికి కారణం ఎంటర్టైన్మెంట్ యాంగిలే. సాయిపల్లవి నుంచి అలాంటి టిపికల్, అగ్రెసివ్ క్యారెక్టర్లే ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇటీవలే విడుదలైన విరాటపర్వంలో వెన్నెల పాత్ర చూసి సాయిపల్లవి అభిమానులకు గుండె పగిలిందనే చెప్పాలి. ఆ పాత్రను అంత శోకంతో చూపించి, విషాదభరితంగా ముగించడం మెజారిటీ ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు ప్రస్తుత ట్రెండులో ఆ టైపు సీరియస్ సినిమాలు, క్యారెక్టర్లు అసలు వర్కవుట్ కావట్లేదు. దీని కంటే ముందు సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీలో సైతం ఆమెది బాధతో నలిగిపోయే, ప్రేక్షకులనూ బాధ పెట్టే పాత్రే. ఈ తరహా ఏడుపుగొట్టు పాత్రలు ఇక వద్దని, జాలీగా ఉండే అల్లరి పాత్రలు చేయాలని సాయిపల్లవికి సోషల్ మీడియా ద్వారా అభిమానులు విజ్ఞప్తులు పెడుతున్నారు.
ఈ నెలలోనే విడుదల కాబోతున్న గార్గి పోస్టర్లు చూసినా.. అది సీరియస్ సినిమాలాగే కనిపిస్తోంది. మళ్లీ ఏదో సమస్యతో ముడిపడ్డ సినిమాలోనే సాయిపల్లవి నటిస్తున్నట్లు కనిపిస్తోందని, ఇలాంటి పాత్రలు ఇక చాలించి సరదా పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 4, 2022 9:25 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…