పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్వశక్తితో చాలా పెద్ద రేంజికి ఎదిగాడు తమిళ కథానాయకుడు ధనుష్. బేసిగ్గా తమిళ నటుడే కానీ.. ఇప్పుడతను అంతర్జాతీయ స్థాయిలో ఫేమ్ సంపాదించాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో.. రాన్జానా, షమితాబ్, ఆత్రంగిరే లాంటి చిత్రాలతో హిందీలో మంచి పేరు తెచ్చుకున్న ధనుష్.. ఇప్పటికే ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్ అనే ఇంటర్నేషనల్ మూవీలో నటించాడు.
త్వరలోనే రుసో బ్రదర్స్ రూపొందించిన నెట్ ఫ్లిక్స్ మూవీ ది గ్రే మ్యాన్లోనూ మెరవబోతున్నాడు. అతను ప్రస్తుతం తొలిసారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశముంది.
దీని తర్వాత ధనుష్ తన తొలి పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాను శనివారమే ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్ కూడా ఖరారైంది ఈ చిత్రానికి. ధనుష్ ఈసారి ఓ విలక్షణ దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడు. అతడి పేరు.. అరుణ్ మాథేశ్వరన్. అతను రాకీ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సాని కాయిదం తీశాడు. ఈ చిత్రం తెలుగులో చిన్ని పేరుతో అనువాదం అయింది. కీర్తి సురేష్, ధనుష్ అన్న అయిన దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే నేరుగా అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అందులో అడుగడుగునా దర్శకుడి ప్రతిభ ఉట్టి పడింది.
ఇలాంటి దర్శకుడితో ధనుష్ జట్టు కడుతుండటం, అది పాన్ ఇండియా మూవీ కావడం ఆసక్తి రేకెత్తించేదే. రెండు చిత్రాల అనుభవం ఉన్నప్పటికీ ఈ దర్శకుడితో సినిమా చేయడం తన అదృష్టంగా ధనుష్ పేర్కొనడం విశేషం. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఇది భారీ చిత్రంలాగే కనిపిస్తోంది.
This post was last modified on July 2, 2022 9:44 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…