పవిత్ర లోకేష్.. ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారిన పేరు. కన్నడలో కథానాయికగా నటించి.. లేటు వయసులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి పేరు సంపాదించిందామె. హోమ్లీ క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన పవిత్ర.. ‘సమ్మోహనం’ సినిమాలో సీనియర్ నటుడు నరేష్కు భార్యగా నటించిన సమయంలో ఆయనతో స్నేహం కుదరడం.. ఆ తర్వాత ఇద్దరూ సన్నిహితంగా మెలగడం తెలిసిందే. బయట కొన్ని వేడుకలకు, కార్యక్రమాలకు జంటగా వెళ్లడంతో నరేష్, పవిత్ర కలిసి జీవిస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.
ఇంతలోనే నరేష్ మూడో భార్య మీడియా ముందుకు రావడం.. నరేష్ తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారని.. అలాగే తనను గన్ను పెట్టి బెదిరించి మరీ విడాకుల కోసం డిమాండ్ చేశారని ఆరోపించడం సంచలనం రేపింది.
దీనికి ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేష్ సైతం బదులిచ్చారు. మరోవైపు పవిత్ర కూడా బెంగళూరు నుంచి మీడియాతో మాట్లాడింది. నరేష్తో తన స్నేహం, ఇతర విషయాలపై వివరణ ఇచ్చింది. నరేష్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనొక నిఖార్సయిన జెంటిల్మేన్ అని ఆమె కితాబిచ్చారు. నరేష్ తన జీవితంలో జరిగిందంతా తనకు చెప్పారని.. తమ మధ్య ఏ దాపరికాలూ లేవని ఆమె అన్నారు. ప్రస్తుతం తాను నరేష్కు తోడుగా ఉంటున్నానని పవిత్ర చెప్పారు. నరేష్ వ్యక్తిగత విషయాలు ఆయనే చూసుకుంటారని.. అలాగే తన వ్యక్తిగత విషయాలు తాను చూసుకుంటున్నానని.. తమ మధ్య ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఉందని పవిత్ర వివరణ ఇచ్చింది.
నరేష్తో గొడవలు ఉంటే రమ్య హైదరాబాద్లో చూసుకోవాలని.. కానీ బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇక భర్తగా అందరూ భావిస్తున్న సుచేంద్ర గురించి ఆమె వివరణ ఇచ్చింది. సుచేంద్రతో తాను సహజీవనం మాత్రమే చేశానని.. ఆయన తన భర్త కాదని.. మరి ఆయనకు విడాకులు ఇచ్చే ప్రశ్న ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. వికీ పీడియాలో పవిత్ర భర్తగా ఇప్పటికీ సుచేంద్ర పేరు ఉండగా.. ఆయన్ని తాను పెళ్లి చేసుకోలేదని, 2017 నుంచి తాను ఆయనకు దూరంగా ఉంటున్నానని పవిత్ర స్పష్టం చేసింది.
This post was last modified on July 2, 2022 4:42 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…