రెండేళ్లకు పైగా గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వచ్చినప్పుడంతా ఎలాంటి ఫలితాలు వస్తాయోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది. ఒక్క హిట్టు వస్తే చాలు ఆపై పది ఫ్లాపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మాధవన్ రాకెట్రీతో పాటు నార్త్ ఆడియన్స్ ని పలకరించిన మరో మూవీ రాష్ట్ర కవచ్ ఓమ్. అదిత్యా రాయ్ కపూర్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కపిల్ వర్మ దర్శకుడు కాగా సంజనా సంఘీ హీరోయిన్.
ట్రైలర్ చూశాక ఇదేదో మాస్ కి కనెక్ట్ అవుతుందేమోనన్న ట్రేడ్ అంచనాలకు భిన్నంగా ఈ రాష్ట్ర కవచ్ ఓమ్ బకెట్ తన్నేసింది. దేశభక్తి కాన్సెప్ట్ కాసుల కామధేనువుగా మారిన ట్రెండ్ లో ఇందులోనూ అదే జొప్పించారు. అండర్ కవర్ ఆపరేషన్ మీద ఉంటూ శత్రవులకు దొరికిపోయిన ఓ వీరుడి గాథ ఇది. అతను ఏ మిషన్ మీద పని చేశాడు, ఎవరి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టాడనే పాయింట్ మీద ఈ ఓమ్ రూపొందింది. సినిమా మొత్తం అతి బిల్డప్పులే. అర్ధం లేని ఓవర్ స్లో మోషన్ షాట్లతో ప్రేక్షకుల కళ్ళకు ఐఎఎస్ పరీక్ష పెట్టారు.
ఆదిత్య రాయ్ కండలు చూపించాడనికి తప్ప ఈ ఓమ్ ఇంకెందుకు పనికిరాలేదని క్రిటిక్స్ ఓమ్ మీద విరుచుకుపడుతున్నారు. ఎమోషన్లను ప్రెజెంట్ చేయడమెలాగో సౌత్ మేకర్స్ నుంచి నేర్చుకోమంటూ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను ఉదాహరణగా చూపిస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ వీడియో గేమ్ కన్నా దారుణంగా ఉండటంతో సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉంది. భూల్ భులాయ్యా 2 విజయాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడీ ఓమ్ దాని మీద నీళ్లు చల్లేసింది.
This post was last modified on July 1, 2022 5:02 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…