Movie News

బాలీవుడ్ నెత్తి మీద ఓమ్ పిడుగు

రెండేళ్లకు పైగా గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వచ్చినప్పుడంతా ఎలాంటి ఫలితాలు వస్తాయోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది. ఒక్క హిట్టు వస్తే చాలు ఆపై పది ఫ్లాపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మాధవన్ రాకెట్రీతో పాటు నార్త్ ఆడియన్స్ ని పలకరించిన మరో మూవీ రాష్ట్ర కవచ్ ఓమ్. అదిత్యా రాయ్ కపూర్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కపిల్ వర్మ దర్శకుడు కాగా సంజనా సంఘీ హీరోయిన్.

ట్రైలర్ చూశాక ఇదేదో మాస్ కి కనెక్ట్ అవుతుందేమోనన్న ట్రేడ్ అంచనాలకు భిన్నంగా ఈ రాష్ట్ర కవచ్ ఓమ్ బకెట్ తన్నేసింది. దేశభక్తి కాన్సెప్ట్ కాసుల కామధేనువుగా మారిన ట్రెండ్ లో ఇందులోనూ అదే జొప్పించారు. అండర్ కవర్ ఆపరేషన్ మీద ఉంటూ శత్రవులకు దొరికిపోయిన ఓ వీరుడి గాథ ఇది. అతను ఏ మిషన్ మీద పని చేశాడు, ఎవరి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టాడనే పాయింట్ మీద ఈ ఓమ్ రూపొందింది. సినిమా మొత్తం అతి బిల్డప్పులే. అర్ధం లేని ఓవర్ స్లో మోషన్ షాట్లతో ప్రేక్షకుల కళ్ళకు ఐఎఎస్ పరీక్ష పెట్టారు.

ఆదిత్య రాయ్ కండలు చూపించాడనికి తప్ప ఈ ఓమ్ ఇంకెందుకు పనికిరాలేదని క్రిటిక్స్ ఓమ్ మీద విరుచుకుపడుతున్నారు. ఎమోషన్లను ప్రెజెంట్ చేయడమెలాగో సౌత్ మేకర్స్ నుంచి నేర్చుకోమంటూ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను ఉదాహరణగా చూపిస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ వీడియో గేమ్ కన్నా దారుణంగా ఉండటంతో సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉంది. భూల్ భులాయ్యా 2 విజయాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడీ ఓమ్ దాని మీద నీళ్లు చల్లేసింది.

This post was last modified on July 1, 2022 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

39 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago