ఈ హీరోకు ఒక హిట్ పడితే బాగుండే అని ఆ హీరో అభిమానులు ఈ హీరో అభిమానులు అని తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరూ కోరుకున్నది అల్లరి నరేష్ విషయంలోనే అని చెప్పాలి. ‘అల్లరి’ మొదలుకుని ‘సుడిగాడు’ వరకు మన ప్రేక్షకులను అతను అంతగా నవ్వించాడు మరి. కాకపోతే ఆ కామెడీ కూడా మూసగా తయారవడంతో ప్రేక్షకులు అతడి సినిమాలను తిరస్కరించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి రెండేళ్ల కిందట వచ్చిన ‘నాంది’తో అల్లరోడు తాను కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు.
నరేష్ సినిమా బాగుందని టాక్ రాగానే.. ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వెళ్లి చూశారు. ఓటీటీలో సైతం ఈ చిత్రం బాగా ఆదరణ పొందింది. దీని తర్వాత ‘సభకు నమస్కారం’ అనే సినిమాను మొదలుపెట్టగా.. దాని నిర్మాత మహేష్ కోనేరు చనిపోవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఆపై నరేష్ లైన్లో పెట్టిన సినిమా.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ‘నాంది’ తరహాలోనే ఇది కూడా సీరియస్ మూవీలా కనిపించింది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. అందులో ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ పడ్డ కష్టమంతా కనిపించింది. మారేడుమిల్లి అంటే ఏజెన్సీ ఏరియా. రియల్ లొకేషన్లలో షూటింగ్ అంటే అంత తేలిక కాదు. అడవులు, కొండల్లోకి వెళ్లి రోజూ షూట్ చేయడం అంటే చాలా కష్టమే ఉంటుంది. రోజూ షూటింగ్ సామగ్రి అంతా ఎత్తుకుని 250 మంది దాకా మూణ్నాలుగు గంటలు అడివిలోకి నడిచి వెళ్లి సన్నివేశాలు తీయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వీడయోలో చూపించారు.
హిమాలయాల్ని గుర్తు చేసే వంజంగికి కూడా చిత్ర యూనిట్ ట్రెక్కింగ్ చేసి వెళ్లి షూట్ చేయడం విశేషం. తమ కష్టాన్ని దృశ్యాల రూపంలో చూపించి.. జూన్ 30న టీజర్ లాంచ్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో చూస్తే షూటింగ్లో ఇంత కష్టముంటుందా అనిపిస్తుంది అందరికీ. మరి ఈ కష్టానికి తగ్గ ఫలితాన్ని సినిమా అందిస్తుందేమో చూడాలి. ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో నరేష్ సరసన ఆనంది నటించింది. రాజేష్ దండ నిర్మాత.
This post was last modified on June 29, 2022 10:48 am
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…