ఈ హీరోకు ఒక హిట్ పడితే బాగుండే అని ఆ హీరో అభిమానులు ఈ హీరో అభిమానులు అని తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులందరూ కోరుకున్నది అల్లరి నరేష్ విషయంలోనే అని చెప్పాలి. ‘అల్లరి’ మొదలుకుని ‘సుడిగాడు’ వరకు మన ప్రేక్షకులను అతను అంతగా నవ్వించాడు మరి. కాకపోతే ఆ కామెడీ కూడా మూసగా తయారవడంతో ప్రేక్షకులు అతడి సినిమాలను తిరస్కరించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరికి రెండేళ్ల కిందట వచ్చిన ‘నాంది’తో అల్లరోడు తాను కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు.
నరేష్ సినిమా బాగుందని టాక్ రాగానే.. ప్రేక్షకులు బాగానే థియేటర్లకు వెళ్లి చూశారు. ఓటీటీలో సైతం ఈ చిత్రం బాగా ఆదరణ పొందింది. దీని తర్వాత ‘సభకు నమస్కారం’ అనే సినిమాను మొదలుపెట్టగా.. దాని నిర్మాత మహేష్ కోనేరు చనిపోవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఆపై నరేష్ లైన్లో పెట్టిన సినిమా.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ‘నాంది’ తరహాలోనే ఇది కూడా సీరియస్ మూవీలా కనిపించింది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా తెలియజేసింది చిత్ర బృందం. అందులో ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ పడ్డ కష్టమంతా కనిపించింది. మారేడుమిల్లి అంటే ఏజెన్సీ ఏరియా. రియల్ లొకేషన్లలో షూటింగ్ అంటే అంత తేలిక కాదు. అడవులు, కొండల్లోకి వెళ్లి రోజూ షూట్ చేయడం అంటే చాలా కష్టమే ఉంటుంది. రోజూ షూటింగ్ సామగ్రి అంతా ఎత్తుకుని 250 మంది దాకా మూణ్నాలుగు గంటలు అడివిలోకి నడిచి వెళ్లి సన్నివేశాలు తీయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వీడయోలో చూపించారు.
హిమాలయాల్ని గుర్తు చేసే వంజంగికి కూడా చిత్ర యూనిట్ ట్రెక్కింగ్ చేసి వెళ్లి షూట్ చేయడం విశేషం. తమ కష్టాన్ని దృశ్యాల రూపంలో చూపించి.. జూన్ 30న టీజర్ లాంచ్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో చూస్తే షూటింగ్లో ఇంత కష్టముంటుందా అనిపిస్తుంది అందరికీ. మరి ఈ కష్టానికి తగ్గ ఫలితాన్ని సినిమా అందిస్తుందేమో చూడాలి. ఏఆర్ మోహన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో నరేష్ సరసన ఆనంది నటించింది. రాజేష్ దండ నిర్మాత.
This post was last modified on June 29, 2022 10:48 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…