కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. పవర్ స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచేసింది ఆ సినిమా. ఇన్నేళ్ళయినా సినిమా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో ‘ఖుషి’ టచ్ కనిపిస్తుంది. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సినిమా టీజర్ వదిలారు. టీజర్ చూస్తే ‘ఖుషి’ థీమ్ నే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది.
‘ఖుషి’ లో పవన్ , భూమిక లు ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ బయటపడరు. ఇగో లతో ఎక్కువగా మాట్లాడుకోరు. ‘రంగ రంగ వైభవంగా’ లో కూడా సేమ్ ఇదే లైన్ తీసుకున్నాడు దర్శకుడు. అంతే కాదు ఖుషి తరహాలోనే ఇందులో కూడా ఓ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ‘ఖుషి’ ని మక్కి కీ మక్కి కాదు కానీ ఇందులో ఓ మోస్తారు టచెస్ ఉండేలా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమాలో కొన్ని సార్లు పవన్ ని ఇమిటేట్ చేస్తాడని అంటున్నారు. అందులో ఓ ఎక్స్ ప్రెషన్ ఆల్రెడీ టీజర్ లో చూపించి పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.
ఏదేమైనా కొన్నేళ్ళ క్రితం యూత్ ని ‘ఖుషి’ చేసి కాలేజీల కంటే థియేటర్స్ లోనే ఎక్కువ గడిపేలా చేసిన సినిమాను అటు ఇటుగా మళ్ళీ కాస్త మార్పులతో వైష్ణవ్ చేస్తుండటం విశేషమే. సినిమా ఏ మాత్రం బాగున్నా వైష్ణవ్ కి హిట్టు పడినట్టే. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూడాలి మరి మావయ్య లా వైష్ణవ్ కూడా ఈ కాలేజీ లవ్ స్టోరీతో మంచి హిట్ కొడతాడేమో.
This post was last modified on June 27, 2022 6:11 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…