కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. పవర్ స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచేసింది ఆ సినిమా. ఇన్నేళ్ళయినా సినిమా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో ‘ఖుషి’ టచ్ కనిపిస్తుంది. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సినిమా టీజర్ వదిలారు. టీజర్ చూస్తే ‘ఖుషి’ థీమ్ నే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది.
‘ఖుషి’ లో పవన్ , భూమిక లు ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ బయటపడరు. ఇగో లతో ఎక్కువగా మాట్లాడుకోరు. ‘రంగ రంగ వైభవంగా’ లో కూడా సేమ్ ఇదే లైన్ తీసుకున్నాడు దర్శకుడు. అంతే కాదు ఖుషి తరహాలోనే ఇందులో కూడా ఓ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ‘ఖుషి’ ని మక్కి కీ మక్కి కాదు కానీ ఇందులో ఓ మోస్తారు టచెస్ ఉండేలా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమాలో కొన్ని సార్లు పవన్ ని ఇమిటేట్ చేస్తాడని అంటున్నారు. అందులో ఓ ఎక్స్ ప్రెషన్ ఆల్రెడీ టీజర్ లో చూపించి పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.
ఏదేమైనా కొన్నేళ్ళ క్రితం యూత్ ని ‘ఖుషి’ చేసి కాలేజీల కంటే థియేటర్స్ లోనే ఎక్కువ గడిపేలా చేసిన సినిమాను అటు ఇటుగా మళ్ళీ కాస్త మార్పులతో వైష్ణవ్ చేస్తుండటం విశేషమే. సినిమా ఏ మాత్రం బాగున్నా వైష్ణవ్ కి హిట్టు పడినట్టే. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూడాలి మరి మావయ్య లా వైష్ణవ్ కూడా ఈ కాలేజీ లవ్ స్టోరీతో మంచి హిట్ కొడతాడేమో.
This post was last modified on June 27, 2022 6:11 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…