Movie News

మెగా హీరో … ‘ఖుషి’ టచ్

కొన్నేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. పవర్ స్టార్ ఇమేజ్ ని మరింతగా పెంచేసింది ఆ సినిమా. ఇన్నేళ్ళయినా సినిమా ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో ‘ఖుషి’ టచ్ కనిపిస్తుంది. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సినిమా టీజర్ వదిలారు. టీజర్ చూస్తే ‘ఖుషి’ థీమ్ నే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది.

‘ఖుషి’ లో పవన్ , భూమిక లు ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటారు. కానీ బయటపడరు. ఇగో లతో ఎక్కువగా మాట్లాడుకోరు. ‘రంగ రంగ వైభవంగా’ లో కూడా సేమ్ ఇదే లైన్ తీసుకున్నాడు దర్శకుడు. అంతే కాదు ఖుషి తరహాలోనే ఇందులో కూడా ఓ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా ఉండనుందని తెలుస్తుంది. ‘ఖుషి’ ని మక్కి కీ మక్కి కాదు కానీ ఇందులో ఓ మోస్తారు టచెస్ ఉండేలా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమాలో కొన్ని సార్లు పవన్ ని ఇమిటేట్ చేస్తాడని అంటున్నారు. అందులో ఓ ఎక్స్ ప్రెషన్ ఆల్రెడీ టీజర్ లో చూపించి పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

ఏదేమైనా కొన్నేళ్ళ క్రితం యూత్ ని ‘ఖుషి’ చేసి కాలేజీల కంటే థియేటర్స్ లోనే ఎక్కువ గడిపేలా చేసిన సినిమాను అటు ఇటుగా మళ్ళీ కాస్త మార్పులతో వైష్ణవ్ చేస్తుండటం విశేషమే. సినిమా ఏ మాత్రం బాగున్నా వైష్ణవ్ కి హిట్టు పడినట్టే. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది. చూడాలి మరి మావయ్య లా వైష్ణవ్ కూడా ఈ కాలేజీ లవ్ స్టోరీతో మంచి హిట్ కొడతాడేమో.

This post was last modified on June 27, 2022 6:11 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

5 minutes ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

23 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

27 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago