మెగాస్టార్ చిరంజీవి చేతిలో.. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలు మూడున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య (వర్కింగ్ టైటిల్), బోళా శంకర్.. ఇలా సమాంతరంగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు చిరు. అవి కాక యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు చిరు. ఇంకా చిరుతో కథా చర్చలు జరుపుతున్న వేరే దర్శకులు కూడా ఉన్నారు.
త్రివిక్రమ్తో కూడా ఆయనో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ సంగతేంటో ఇంకా తేలలేదు. ఈలోపు చిరు కొత్త సినిమాల జాబితాలో ఇంకో సినిమా చేరింది. ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన మారుతి చిరుతో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చిరునే వెల్లడించడం విశేషం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు ఈ మేరకు ప్రకటన చేశాడు.
యువి క్రియేషన్స్ భాగస్వాముల్లో ఒకరైన విక్కీ.. తన కొడుకు రామ్ చరణ్కు చాలా క్లోజ్ అని, అతను తన కుటుంబ సభ్యుడి లాంటి వాడని.. మారుతి దర్శకత్వంలో తనతో సినిమా చేయాలనుకుంటున్నట్లు అతను చెప్పడంతో తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చిరు వెల్లడించాడు. మారుతి తనకు సన్నిహితుడైన దర్శకుడని, ప్రజారాజ్యం రోజుల్లో పార్టీ జెండా రూపకల్పనతో పాటు, పాట చిత్రీకరణలోనూ కీలక పాత్ర పోషించాడని.. అతను దర్శకుడవుతాడని అప్పుడే అనుకున్నానని.. ఇప్పుడు అతను మంచి మంచి సినిమాలతో ఒక స్థాయి అందుకోవడం సంతోషంగా ఉందని చిరు చెప్పాడు. వేరే సినిమాలు చేస్తూనే తన సినిమా మీద ఫోకస్ పెట్టాలని మారుతికి స్టేజ్ మీది నుంచే చిరు సూచించడం విశేషం.
ఐతే ఇలా స్టేజ్ల మీద చిరు కొత్త సినిమాల గురించి సంకేతాలివ్వడం కొత్తేమీ కాదు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్లతో సినిమాల గురించి కూడా గతంలో ఇలాగే మాట్లాడాడు. కానీ ఇప్పటిదాకా ఆ కాంబినేషన్లు వర్కవుట్ కాలేదు. మరి మారుతితో సినిమా గురించి యథాలాపంగా అన్నాడా.. నిజంగా సినిమా చేస్తాడా అన్నది చూడాలి. ఏదేమైనా పక్కా కమర్షియల్, ప్రభాస్తో చేయబోయే సినిమాల ఫలితాలను బట్టే చిరుతో జట్టు కట్టడం ఆధారపడి ఉంటుందన్నది స్పష్టం.
This post was last modified on June 27, 2022 9:12 am
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…