సినీ రంగంలో ఎవరి రాత అయినా మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అలా రాత మార్చుకున్నాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక మంచి విజయం అందుకునే వరకు పడే కష్టాలు మామూలుగా ఉండవు. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవాలన్నా, గుర్తింపు తెచ్చుకోవాలన్నా చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం కూడా అలాగే ఎన్నో కష్టాలు పడే ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిజీ హీరో అయిపోయాడు.
ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ విడుదలకు ముందే కాక తర్వాత కూడా తనకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదని వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్నాళ్లకు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్లు తనను పిలిచి సినిమా చేద్దాం అన్నారని.. దీంతో తాను చాలా సంతోషించానని.. కానీ వాళ్లు పారితోషకం ఇవ్వం, షూటింగ్కు రావడానికి కారు మాత్రం ఏర్పాటు చేస్తాం అన్నారని.. ఇదేంటని అంటే ఊరికే అందరూ హీరోలైపోరు అన్నారని కిరణ్ వెల్లడించాడు. హీరో అయ్యేదాకా పడేది ఒక కష్టం అయినా.. చిన్న హీరో అని ముద్ర పడడంతో ఎదురయ్యే కష్టాలు ఇంకో రకంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం అని కిరణ్ తెలిపాడు.
తనకు ఇలాంటి అనుభవాలు మరికొన్ని ఉన్నా వేటినీ సీరియస్గా తీసుకోలేదని.. తన అవకాశాలు తానే సృష్టించుకుని హీరోగా నిలదొక్కుకున్నానని.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తనతో పాటు చాలామంది జీవితాన్ని మార్చేసిందని కిరణ్ పేర్కొన్నాడు. మరే రంగంలో లేని నెగెటివిటీ సినిమా రంగంలో తాను చూశానని.. తాను ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చానని తెలిసి ఇండస్ట్రీలో వాళ్లే చాలామంది తిట్టారని.. పెద్ద హీరోలు, దర్శకులు తప్పితే మిగతా వాళ్లందరూ కూడా తమ పిల్లల్ని సినిమాల్లోకి రావద్దని చెబుతారని కిరణ్ అన్నాడు.
This post was last modified on June 26, 2022 1:18 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…