సినీ రంగంలో ఎవరి రాత అయినా మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అలా రాత మార్చుకున్నాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక మంచి విజయం అందుకునే వరకు పడే కష్టాలు మామూలుగా ఉండవు. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవాలన్నా, గుర్తింపు తెచ్చుకోవాలన్నా చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం కూడా అలాగే ఎన్నో కష్టాలు పడే ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిజీ హీరో అయిపోయాడు.
ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ విడుదలకు ముందే కాక తర్వాత కూడా తనకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదని వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్నాళ్లకు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్లు తనను పిలిచి సినిమా చేద్దాం అన్నారని.. దీంతో తాను చాలా సంతోషించానని.. కానీ వాళ్లు పారితోషకం ఇవ్వం, షూటింగ్కు రావడానికి కారు మాత్రం ఏర్పాటు చేస్తాం అన్నారని.. ఇదేంటని అంటే ఊరికే అందరూ హీరోలైపోరు అన్నారని కిరణ్ వెల్లడించాడు. హీరో అయ్యేదాకా పడేది ఒక కష్టం అయినా.. చిన్న హీరో అని ముద్ర పడడంతో ఎదురయ్యే కష్టాలు ఇంకో రకంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం అని కిరణ్ తెలిపాడు.
తనకు ఇలాంటి అనుభవాలు మరికొన్ని ఉన్నా వేటినీ సీరియస్గా తీసుకోలేదని.. తన అవకాశాలు తానే సృష్టించుకుని హీరోగా నిలదొక్కుకున్నానని.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తనతో పాటు చాలామంది జీవితాన్ని మార్చేసిందని కిరణ్ పేర్కొన్నాడు. మరే రంగంలో లేని నెగెటివిటీ సినిమా రంగంలో తాను చూశానని.. తాను ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చానని తెలిసి ఇండస్ట్రీలో వాళ్లే చాలామంది తిట్టారని.. పెద్ద హీరోలు, దర్శకులు తప్పితే మిగతా వాళ్లందరూ కూడా తమ పిల్లల్ని సినిమాల్లోకి రావద్దని చెబుతారని కిరణ్ అన్నాడు.
This post was last modified on June 26, 2022 1:18 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…