సినీ రంగంలో ఎవరి రాత అయినా మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. అలా రాత మార్చుకున్నాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక మంచి విజయం అందుకునే వరకు పడే కష్టాలు మామూలుగా ఉండవు. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి అందుకోవాలన్నా, గుర్తింపు తెచ్చుకోవాలన్నా చాలా కష్టమే పడాల్సి ఉంటుంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ అబ్బవరం కూడా అలాగే ఎన్నో కష్టాలు పడే ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బిజీ హీరో అయిపోయాడు.
ఇటీవలే ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ విడుదలకు ముందే కాక తర్వాత కూడా తనకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదని వెల్లడించాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్నాళ్లకు ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్లు తనను పిలిచి సినిమా చేద్దాం అన్నారని.. దీంతో తాను చాలా సంతోషించానని.. కానీ వాళ్లు పారితోషకం ఇవ్వం, షూటింగ్కు రావడానికి కారు మాత్రం ఏర్పాటు చేస్తాం అన్నారని.. ఇదేంటని అంటే ఊరికే అందరూ హీరోలైపోరు అన్నారని కిరణ్ వెల్లడించాడు. హీరో అయ్యేదాకా పడేది ఒక కష్టం అయినా.. చిన్న హీరో అని ముద్ర పడడంతో ఎదురయ్యే కష్టాలు ఇంకో రకంగా ఉంటాయనడానికి ఇది నిదర్శనం అని కిరణ్ తెలిపాడు.
తనకు ఇలాంటి అనుభవాలు మరికొన్ని ఉన్నా వేటినీ సీరియస్గా తీసుకోలేదని.. తన అవకాశాలు తానే సృష్టించుకుని హీరోగా నిలదొక్కుకున్నానని.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ తనతో పాటు చాలామంది జీవితాన్ని మార్చేసిందని కిరణ్ పేర్కొన్నాడు. మరే రంగంలో లేని నెగెటివిటీ సినిమా రంగంలో తాను చూశానని.. తాను ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చానని తెలిసి ఇండస్ట్రీలో వాళ్లే చాలామంది తిట్టారని.. పెద్ద హీరోలు, దర్శకులు తప్పితే మిగతా వాళ్లందరూ కూడా తమ పిల్లల్ని సినిమాల్లోకి రావద్దని చెబుతారని కిరణ్ అన్నాడు.
This post was last modified on June 26, 2022 1:18 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…