పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ మలయాళ నటుడు ఇప్పటికే తెలుగులో పోలీస్ పోలీస్ అనే సినిమా చేశాడు. డబ్బింగ్ సినిమాలతోనూ మన ప్రేక్షకులను పలకరించాడు. ఈ మధ్య ఓటీటీల పుణ్యమా అని అతడి మలయాళ చిత్రాలకు కూడా మన దగ్గర మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడతను కడువా అనే పాన్ ఇండియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. దీని టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్.. తెలుగులో డైరెక్ట్ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారనే ప్రశ్నకు ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చాడు.
ప్రభాస్ కొత్త చిత్రం సలార్లో ఓ కీలక పాత్రకు తనను రెండేళ్ల ముందు అడిగారని.. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ నరేషన్కు ఫిదా అయిపోయి వెంటనే ఓకే చెప్పేశానని.. కానీ తర్వాత కరోనా కారణంగా షెడ్యూళ్లన్నీ మారిపోవడం, మలయాళంలో తనకు వేరే కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నానని పృథ్వీరాజ్ వెల్లడించాడు.
ఐతే తర్వాత ప్రభాస్ సినిమా షెడ్యూళ్లు, డేట్లలోనూ మార్పు జరగడం, తాను ఈ సినిమాలో నటించాల్సిందే అని ప్రభాస్, ప్రశాంత్ పట్టుబడడంతో ఈ దిశగా సీరియస్గా ఆలోచిస్తున్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. తాను శనివారం రాత్రే ప్రశాంత్ను కలుస్తున్నానని.. డేట్లు సర్దుబాటు అయితే కచ్చితంగా ఈ సినిమాలో నటిస్తానని పృథ్వీరాజ్ స్పష్టం చేశాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గొప్ప ప్థాయికి ఎదిగిందని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం వెలకట్టలేనిదని, ఇక్కడి సినిమాల్లో భాగం కావడం తనకెంతో ఇష్టమని అతనన్నాడు.
చిరంజీవి తాను తీసిన లూసిఫర్ మూవీ తెలుగు రీమేక్ కోసం తననే ముందు అడిగారని, ఖాళీ లేక చేయలేదని.. తన ఇమేజ్కు బాగా సూటయ్యే ఈ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో చేస్తుండటం సంతోషమని, తాను తీయబోతున్న లూసిఫర్-2ను తెలుగులో రీమేక్ చేయమని చిరు అడిగితే తప్పకుండా చేస్తానని పృథ్వీరాజ్ తెలిపాడు.
This post was last modified on June 25, 2022 8:27 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…