లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఈ మధ్య కాలంలో అంతగా చర్చనీయాంశం అయిన దర్శకుడు అతనే. సౌత్ ఇండియాలో టాప్ హీరోలు ఒక సినిమా చేయాలని ఆశపడుతున్న డైరెక్టర్లలో అతనొకడనడంలో సందేహం లేదు. ‘విక్రమ్’ తర్వాత అతడి డిమాండ్ మమూలుగా లేదు. ప్రస్తుతానికి అతను విజయ్తో కొత్త సినిమాకు కమిటై ఉన్నాడు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి విక్రమ్-2, ఖైదీ-2 సినిమాలు చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ లోపు లోకేష్ నుంచి కమిట్మెంట్ తీసుకోవాలని కొందరు స్టార్లు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల లోకేష్తో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాదని తేలింది. తెలుగులో ఏ హీరోతో లోకేష్ ఓ సినిమా చేశాడంటే అది మొదట రామ్ చరణ్తోనే అయ్యుంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చరణ్తో లోకేష్కు అంత రాపో ఉందని, వీరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయని వార్తలు రావడం తెలిసిందే.
తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేష్ మాటల్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చరణ్తో మీ రిలేషన్ ఏంటి.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినపుడు ఏం జరిగింది అని ఈ ఇంటర్వ్యూలో అడగ్గా.. ‘‘రామ్ చరణ్ సార్తో నా పరిచయం ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి మేమిద్దరం టచ్లో ఉన్నాం. తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటాం. గతంలో రెండుసార్లు చరణ్ సార్ను కలిసి కథలు కూడా నరేట్ చేశాను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆయనకు ఫోన్ చేసేంత సాన్నిహిత్యం ఉంది.
ఇటీవల ‘విక్రమ్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లినపుడు.. చిరంజీవి గారి ఇంటి నుంచి డిన్నర్ కోసం ఆహ్వానం వచ్చింది. చిరంజీవి గారితో కలిసి షూటింగ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ గారు కూడా ఆ విందుకు వస్తారని చెప్పారు. నాకు చాలా టెన్షన్గా అనిపించింది. చరణ్ నాకు క్లోజ్ కాబట్టి అతనుంటే కొంచెం సౌకర్యంగా ఉంటుందని చూస్తే.. ఆయన ఊర్లో లేడు. కమల్ సార్తో కలిసి ఆ డిన్నర్కు వెళ్లినపుడు ఎవరెవరు ఏం సినిమాలు చేస్తున్నాం అనేదే మాట్లాడుకున్నాం. అంతకుమించి ఏమీ లేదు’’ అని లోకేష్ తెలిపాడు. లోకేష్ మాటల్ని బట్టి చూస్తే చరణ్కు అతను బాగానే క్లోజ్ అని అర్తమవుతోంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on June 22, 2022 11:50 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…