Movie News

మానాడుని మర్చిపోయారా బాస్

8 నెలల క్రితం తమిళంలో విడుదలైన మానాడు ఎంత పెద్ద హిట్టో కోలీవుడ్ అప్డేట్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తెలుసు. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న శింబుకి పర్ఫెక్ట్ కంబ్యాక్ గా నిలిచింది. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందివ్వాలనే ఉద్దేశంతో అదే డేట్ (నవంబర్ 25) కి డబ్బింగ్ వెర్షన్ ని సిద్ధం చేశారు. రెండు మూడు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం పెట్టారు. ఇంతలో లోలోపల ఏమైయ్యిందో కానీ సరిగ్గా సమయానికి ఏపి తెలంగాణలో బొమ్మ పడలేదు. హైదరాబాద్ లో కేవలం తమిళ ప్రింట్ రిలీజయ్యింది.

కట్ చేస్తే కొద్దిరోజుల తర్వాత రీమేక్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హక్కులు తాము కొన్నామని, ఎవరు కాపీ చేసినా సన్నివేశాలను వాడుకున్నా చర్యలు తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. సరే ఎవరితో తీస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. నాగ చైతన్య, రానా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ ఇలా ఏవేవో ఆప్షన్లు తెరపైకి తీసుకొచ్చారు. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఏదీ కార్యరూపం దాల్చలేదు. కాలం కర్పూరంలా కరిగిపోతున్నా ఎలాంటి న్యూస్ లేదు.

ఈలోగా మానాడు దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్యతో ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు. అడిగితే రీమేక్ కాదు ఫ్రెష్ సబ్జెక్టన్నారు. అంటే మానాడుని పూర్తిగా అటకెక్కించారా లేక ఫ్యూచర్ లో తీస్తారా అనేది తెలియలేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ముస్లిం. తీవ్రవాదానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. టైం లూప్ కాన్సెప్ట్ కాబట్టి సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతాయి. ఇంత టిపికల్ పాయింట్ తో మన ఆడియన్స్ ని కన్వీన్స్ చేయలేమని తప్పుకున్నారో లేక ఎవరూ దొరక్క ఆలస్యం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు.

This post was last modified on June 20, 2022 10:52 am

Share
Show comments

Recent Posts

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

1 hour ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

2 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

2 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

4 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

4 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

4 hours ago