Movie News

మానాడుని మర్చిపోయారా బాస్

8 నెలల క్రితం తమిళంలో విడుదలైన మానాడు ఎంత పెద్ద హిట్టో కోలీవుడ్ అప్డేట్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తెలుసు. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న శింబుకి పర్ఫెక్ట్ కంబ్యాక్ గా నిలిచింది. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందివ్వాలనే ఉద్దేశంతో అదే డేట్ (నవంబర్ 25) కి డబ్బింగ్ వెర్షన్ ని సిద్ధం చేశారు. రెండు మూడు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం పెట్టారు. ఇంతలో లోలోపల ఏమైయ్యిందో కానీ సరిగ్గా సమయానికి ఏపి తెలంగాణలో బొమ్మ పడలేదు. హైదరాబాద్ లో కేవలం తమిళ ప్రింట్ రిలీజయ్యింది.

కట్ చేస్తే కొద్దిరోజుల తర్వాత రీమేక్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హక్కులు తాము కొన్నామని, ఎవరు కాపీ చేసినా సన్నివేశాలను వాడుకున్నా చర్యలు తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అఫీషియల్ గా ప్రకటించింది. సరే ఎవరితో తీస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. నాగ చైతన్య, రానా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ ఇలా ఏవేవో ఆప్షన్లు తెరపైకి తీసుకొచ్చారు. కానీ అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. ఏదీ కార్యరూపం దాల్చలేదు. కాలం కర్పూరంలా కరిగిపోతున్నా ఎలాంటి న్యూస్ లేదు.

ఈలోగా మానాడు దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్యతో ఓ ప్రాజెక్టు సెట్ చేసుకున్నారు. అడిగితే రీమేక్ కాదు ఫ్రెష్ సబ్జెక్టన్నారు. అంటే మానాడుని పూర్తిగా అటకెక్కించారా లేక ఫ్యూచర్ లో తీస్తారా అనేది తెలియలేదు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ముస్లిం. తీవ్రవాదానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. టైం లూప్ కాన్సెప్ట్ కాబట్టి సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతాయి. ఇంత టిపికల్ పాయింట్ తో మన ఆడియన్స్ ని కన్వీన్స్ చేయలేమని తప్పుకున్నారో లేక ఎవరూ దొరక్క ఆలస్యం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు.

This post was last modified on June 20, 2022 10:52 am

Share
Show comments

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago