ఎన్నో ఎదురుచూపులు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం విడుదలైపోయింది. దగ్గుబాటి అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఫలితం గురించి అప్పుడే ఒక కంక్లూజన్ కు రావడం తొందపాటు అవుతుంది కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు ఇంటర్వ్యూలలో రానా అన్న మాటలు సినిమా చూశాక నిజమనిపిస్తున్న మాట వాస్తవం. ఈ సినిమాకు సాయిపల్లవే హీరో అని రవన్న పాత్ర ఎవరైనా చేయొచ్చు కానీ వెన్నెల క్యారెక్టర్ లో మాత్రం ఇంకెవరిని ఊహించుకోలేమని చెప్పి అంచనాలు అమాంతం పెంచేశాడు.
ఇలా పదే పదే హీరోయిన్ గురించి ఇంతగా హై లైట్ చేయడం పట్ల రానా ఫ్యాన్స్ కొంత ఫీలైనప్పటికీ అతని నిజాయితీ అందరికి కనెక్ట్ అయ్యింది. విరాటపర్వంలో నిజంగానే సాయిపల్లవి వన్ విమెన్ షో చేసేసింది. ఇంత బరువైన ఎమోషన్లున్న పాత్రని ఇంకెవరు చేయగలరని ఆలోచిస్తే సమాధానం దొరకదు. ప్రేమకోసం తపించే అమ్మాయిగా, ప్రియుడి కోసం గన్ను పట్టుకుని ప్రాణాలకు సైతం తెగించే కామ్రేడ్ గా, క్లైమాక్స్ లో కంటతడి పెట్టించే ఎక్స్ ప్రెషన్లతో మొత్తానికి రానా చెప్పినట్టు చెలరేగిపోయింది.
కాకపోతే ఫిదాలాగా సాయిపల్లవి దీన్ని బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు నెగ్గుకు వస్తుందనేది చూడాలి. ఎందుకంటే విరాట పర్వం ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించడం కష్టమే. యూత్ అండ్ మాస్ మీదే ఆధారపడాలి. పైగా మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. మెల్లగా లేడీ పవర్ స్టార్ బిరుదుని సాయిపల్లవికి తగిలిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో పెర్ఫార్మన్స్ లు ఒకటే కాదు బాక్సాఫీస్ సక్సెస్ లు కూడా కీలకంగా ఉంటాయి. రెగ్యులర్ పాత్రలకు దూరమనే సాయిపల్లవి ఇంకెలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుందో .
This post was last modified on June 17, 2022 7:09 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…