Movie News

నిర్మాతగా నాని పంట పండిందిగా..

నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ మధ్య ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తున్నాడు. కరోనా టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీల బాట పట్టిన ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు అతడి క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీశాయి. ఆ ప్రభావం ‘శ్యామ్ సింగ రాయ్’ మీద కూడా కాస్త పడింది. ఈ సినిమాకు చాలా మంచి టాక్ రాగా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఐతే ఓవరాల్‌గా అది బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడింది.

ఇక ఇప్పుడేమో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో నాని ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా మిగిలేలా కనిపిస్తోంది. మొత్తానికి నాని మార్కెట్ కొంత మేర దెబ్బ తిన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తర్వాతి చిత్రాల విషయంలో నేచురల్ స్టార్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఐతే హీరోగా నాని కెరీర్ కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ.. నిర్మాతగా మాత్రం అతడికి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.

ఇప్పటికే అతను తన సొంత బేనర్లో ‘అ!’, ‘హిట్’ చిత్రాలను నిర్మించాడు. అవి రెండూ అతడికి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు నానితన అక్క దీప్తి గంట దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. పెట్టుబడి మీద మంచి లాభానికే సినిమాను అమ్మేశారట. మరోవైపు నాని బేనర్లో ‘హిట్-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

‘హిట్’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడం, పైగా అడివి శేష్ ఇందులో లీడ్ రోల్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే శేష్ ‘మేజర్’ కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకున్నాడు. ఒక్కసారిగా అతడి మార్కెట్ బాగా పెరిగిపోయింది. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇది మూణ్నాలుగు రెట్లు ఎక్కువ వసూల్లు రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్లో శేష్‌కు గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ‘హిట్-2’ బిజినెస్ పెద్ద స్థాయిలో జరగడం, విడుదలకు ముందే నాని భారీ లాభాలు అందుకోవడం ఖాయం. మొత్తానికి హీరోగా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ.. నిర్మాతగా మాత్రం నానీకి బాగానే కలిసొస్తోంది. 

This post was last modified on June 16, 2022 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

31 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago