నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ మధ్య ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తున్నాడు. కరోనా టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీల బాట పట్టిన ‘వి’, ‘టక్ జగదీష్’ చిత్రాలు అతడి క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీశాయి. ఆ ప్రభావం ‘శ్యామ్ సింగ రాయ్’ మీద కూడా కాస్త పడింది. ఈ సినిమాకు చాలా మంచి టాక్ రాగా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఐతే ఓవరాల్గా అది బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడింది.
ఇక ఇప్పుడేమో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో నాని ప్రేక్షకుల ముందుకు రాగా.. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా మిగిలేలా కనిపిస్తోంది. మొత్తానికి నాని మార్కెట్ కొంత మేర దెబ్బ తిన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తర్వాతి చిత్రాల విషయంలో నేచురల్ స్టార్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఐతే హీరోగా నాని కెరీర్ కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ.. నిర్మాతగా మాత్రం అతడికి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది.
ఇప్పటికే అతను తన సొంత బేనర్లో ‘అ!’, ‘హిట్’ చిత్రాలను నిర్మించాడు. అవి రెండూ అతడికి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు నానితన అక్క దీప్తి గంట దర్శకత్వంలో ‘మీట్ క్యూట్’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. పెట్టుబడి మీద మంచి లాభానికే సినిమాను అమ్మేశారట. మరోవైపు నాని బేనర్లో ‘హిట్-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
‘హిట్’కు కొనసాగింపుగా వస్తున్న చిత్రం కావడం, పైగా అడివి శేష్ ఇందులో లీడ్ రోల్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే శేష్ ‘మేజర్’ కెరీర్లోనే అతి పెద్ద విజయం అందుకున్నాడు. ఒక్కసారిగా అతడి మార్కెట్ బాగా పెరిగిపోయింది. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇది మూణ్నాలుగు రెట్లు ఎక్కువ వసూల్లు రాబట్టింది. పాన్ ఇండియా లెవెల్లో శేష్కు గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ‘హిట్-2’ బిజినెస్ పెద్ద స్థాయిలో జరగడం, విడుదలకు ముందే నాని భారీ లాభాలు అందుకోవడం ఖాయం. మొత్తానికి హీరోగా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ.. నిర్మాతగా మాత్రం నానీకి బాగానే కలిసొస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…